
ఇక ఈ–టికెట్లు..
డిజిటల్మయంగా
రామాలయం
రామాలయం డిజిటల్మయంగా మారుతోంది. తొలుత దేవస్థాన వెబ్సైట్ ఆధునికీకరించారు. లడ్డూ కౌంటర్లలో టికెట్లను కంప్యూటరైజ్డ్ చేశారు. నిత్యన్నదానం, గోశాలకు విరాళాలు ఇచ్చే వారి వివరాల నమోదుతో పాటు దాతలకు ఆన్లైన్ రశీదులు అందజేస్తున్నారు. స్వామివారి వస్త్రాల విక్రయాలకు బార్కోడ్ రూపొందించారు. ప్రొటోకాల్ దర్శనానికి వచ్చే వారికి స్కాన్తో ఫొటో తీసి ఎంట్రీ టికెట్ అందజేస్తున్నారు. అన్నదానానికీ ఈ–టోకెన్ ఇస్తున్నారు. ఇలా అన్ని విభాగాల్లో డిజిటల్ సేవలను విస్తరింపజేశారు.