
కాంగ్రెస్ను బలోపేతం చేయాలి
చుంచుపల్లి: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. చుంచుపల్లి మండలంలోని నందాతండా, ధన్ బాద్, గౌతంపూర్, రుద్రంపూర్, పెనగడప గ్రామాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాల్లో ఆయన పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తీక్, నాయకులు ఆళ్ల మురళి, పెదబాబు, అంతోటి పాల్, చింతలపూడి రాజశేఖర్, జేవీఎస్ చౌదరి, వై.శ్రీనివాస్ రెడ్డి, బోదాసు కనకరాజు, ఎండి రజాక్, పీతాంబరం తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి