
ఇల్లెందు ఆస్పత్రి ఉద్యోగులకు ప్రశంస
ఇల్లెందు: ఇల్లెందు ఏరియా ఆస్పత్రి ఉద్యోగులకు వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. జిల్లాలోని ఆరు ఏరియా ఆస్పత్రుల్లో మెరుగైన పనితీరు కనబరిచిన ఉద్యో గులను గుర్తించి శుక్రవారం కలెక్టరేట్లో పత్రాలు అందజేశారు.ప్రశంసలు అందుకున్న వారిలో ఇల్లెందు నుంచి డాక్టర్ హర్షవర్ధన్, రాంనివాస్, బన్సీలాల్, ఎల్టీ రాజేష్, ఫార్మసీ శ్రీలత, నర్సింగ్ ఆఫీసర్లు షర్మిల, భారతి, ఫర్జానా, సెక్యురిటీ శ్రీను, శానిటేషన్ సూపర్వైజర్ రాము, ఉదయ్, సాయికృష్ణ ఉన్నారు.