
సన్నబియ్యం తూకంలో తేడాలు
ములకలపల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకం క్షేత్రస్థాయిలో అభాసుపాలవుతోంది. రేషన్ దుకాణంలో చేస్తున్న మాయాజాలంతో లబ్ధిదారులకు రావాల్సిన వాటికన్నా కొంతమేర కోత పడుతోంది. ములకలపల్లి రేషన్ దుకాణంలో ఈ నెల 1వ తేదీ నుంచి మూడు నెలలకు సరిపడా సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. ఒకేసారి మూడు నెలలకు బియ్యం అందుతున్నా యని ఆనందిస్తున్న తరుణంలోనే, రావాల్సిన వాటికంటే తగ్గువగా బియ్యం ఇస్తున్నారు. రేషన్ దుకాణంలోని యాభై కిలోల బియ్యం బస్తాలో ముందుకుగానే కొన్ని బియ్యం తీసి, లబ్ధిదారుడికి ఇచ్చే సమయంలో తూకం వేయకుండా ఇస్తున్నారు. గత బుధవారం పంపిణీ చేసిన ఇరువురికి బియ్యం తక్కువగా రావడంతో విషయం బయటపడింది. ఈ విషయమై ములకలపల్లి రేషన్షాపు సేల్స్మెన్ అగ్గిరాంను వివరణ కోరగా.. రేషన్ సెంటర్కు వచ్చే యాభై కిలోల బియ్యం బస్తాల్లో బియ్యం ఎక్కువగా ఉంటున్నాయని, దీంతో బస్తా సీల్ తీసి, కొంతబియ్యం తీసి తూకం వేయకుండా లబ్ధిదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఇకపై అన్ని బస్తాలూ తూకం వేసి, సక్రమంగా బియ్యం అందేలా చూస్తామని చెప్పారు.
రేషన్షాపులో మాయాజాలం