
ఒలింపిక్ రన్ సక్సెస్
భద్రాచలంటౌన్: పట్టణంలో అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ రన్ విజయవంతమైంది. పాల్వంచలో మొదలైన రన్ దమ్మపేట మీదుగా భద్రాచలం వరకు ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ రాహుల్, ఏఎస్పీ విక్రమ్ కుమార్ సింగ్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ యుగంధర్ రెడ్డి మాట్లాడారు. పట్టణంలో త్వరలో 400 మీటర్ల అథ్లెటిక్స్ ట్రాక్ కోసం ఐదెకరాల స్థలం సేకరించనున్నట్లు తెలిపారు. అసోసియేషన్ బాధ్యులు మహిధర్, నాగ సీతారాములు, వెంకటేశ్వర్లు, నాగేంద్రబాబు, గిరి ప్రసాద్, దాట్ల రాజు, కుంచాల రమేష్, ఉదయ్ కుమార్, రామి రెడ్డి, శ్వేత, దుర్గారావు, ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు.