అంతా ఔట్‌ సోర్సింగే.. | - | Sakshi
Sakshi News home page

అంతా ఔట్‌ సోర్సింగే..

Jun 21 2025 3:09 AM | Updated on Jun 21 2025 3:09 AM

అంతా ఔట్‌ సోర్సింగే..

అంతా ఔట్‌ సోర్సింగే..

● రెగ్యులర్‌ ఉద్యోగులు లేరు.. ● మార్కెట్ల ఆదాయ మార్గాలే చెక్‌ పోస్టులు.. ● జిల్లాలో కొత్తగూడెం, దమ్మపేట, బూర్గంపాడు, భద్రాచలం, చర్ల, ఇల్లెందు మార్కెట్లు

ఇల్లెందు: మార్కెట్‌ యార్డులకు ఆదాయం కలిగిన చెక్‌ పోస్టులన్నీ ఏళ్లతరబడి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో నడుస్తున్నాయి. కోట్ల రూపాయల ఆదాయం కలిగిన మార్కెట్‌ యార్డులు పటిష్టపర్చటంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. జిల్లాలోని ఆరు మార్కెట్‌ కమిటీల పరిధిలో 18 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. ఏ ఒక్క మార్కెట్‌ చెక్‌ పోస్టులో కూడా రెగ్యులర్‌ ఉద్యోగులు లేరు. ఇతర సూపర్‌వైజర్‌ పోస్టులు కూడా చాలావరకు ఔట్‌ సోర్సింగ్‌ వారితో నెట్టుకొస్తున్నారు. ఇక భద్రాచలం లాంటి మార్కెట్‌లో ఇద్దరు ఉద్యోగులు ఉన్నా మహిళలే కావటంతో పర్యవేక్షణ కష్టంగా మారింది. దీనికి తోడు ఆయా మార్కెట్‌ కమిటీల పరిధిలో ఆదాయం కోసం ఏర్పాటు చేసుకున్న చెక్‌ పోస్టుల్లో చాలా వరకు పైసా వసూలు చేయని చెక్‌ పోస్టులుఉన్నాయి. అలాంటి వాటిని మార్చకుండామరో మార్గంలో ఏర్పాటు చేయకుండా ఆదాయం లేని చెక్‌ పోస్టులను నేటికీ కొనసాగిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్నీ వ్యవసాయ మార్కెట్‌లు సీజనల్‌గా సాగేవే ఉన్నాయి. ఏడాది పొడవునా ఏ ఒక్క మార్కెట్‌లో క్రయ విక్రయాలు సాగటం లేదు. మార్కెట్‌లకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం సాంధించాలంటే చెక్‌ పోస్టులపై ఆధారపడాల్సిందే. ఈ తరుణంలో చెక్‌ పోస్టులు కీలకంగా మారుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం, దమ్మపేట, బూర్గంపాడు, భద్రాచలం, చర్ల, ఇల్లెందు మార్కెట్‌యార్డులున్నాయి. సీజనల్‌ మార్కెట్‌లు కావటంతో పాటు సిబ్బంది సరిపడా లేకపోవటం వల్ల పర్యవేక్షణ కరువైంది. ఎన్నో రకాల పంట ఉత్పత్తులను మార్కెట్‌లో క్రయవిక్రయాలు చేసుకునే అవకాశం ఉంది. కానీ, ఏ ఒక్క అధికారి కూడా ఆ మార్కెట్‌ సాగేలా ప్రణాళిక రూపొందించడం లేదు. రాజకీయ ఒత్తిళ్లు కూడా తోడవుతున్నాయి. ఎక్కడైనా వ్యాపారులు మార్కెట్‌కు రావాలంటే అక్కడ రాజకీయ ఒత్తిడి మొదలవుతోంది. దీంతో అధికారులు ఆదాయం రాబట్టుకునేందుకు పాటుపడుతున్నారు. జిల్లాలో కొన్ని చెక్‌ పోస్టులు అధిక ఆదాయం కలిగిఉన్నాయి. సరిహద్దు చెక్‌ పోస్టులు పటిష్టంగా ఏర్పాటు చేస్తే ఆదాయం మెరుగవుతుంది. 2025–26 సంవత్సరంలో రూ.22.65 కోట్ల లక్ష్యానికి గాను రూ.21.69 కోట్లు సాధించారు.

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది, గత ఏడాది మార్కెట్లకు నిర్దేశించిన లక్ష్యం, అవి సాధించిన లక్ష్యం ఇలా ఉంది..

జిల్లాలో చెక్‌ పోస్టులు ఇలా..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరు మార్కెట్‌ యార్డులు ఉండగా 18 వరకు చెక్‌ పోస్టులు ఉన్నాయి. కొత్తగూడెంలో–3, ఇల్లెందులో–4, దమ్మపేటలో–2, బూర్గంపాడులో–4, చర్లలో–4, భద్రాచలంలో–1 ఉన్నాయి. ఇల్లెందు మార్కెట్‌ పరిధిలోని సుదిమళ్ల చెక్‌ పోస్టు ద్వారా 2014–15లో రూ.51.72 లక్షలు, 2015–16లో రూ.62.70 లక్షలు, 2016–17లో రూ.56.40 లక్షలు, 2017–18లో రూ.28.34 లక్షలు, 2018–19లో రూ.13.48 లక్షలు, 2019–20లో 20.31లక్షలు, 2020–21లో రూ.5.77 లక్షలు, 2021–22లో రూ.26.84 లక్షలు, 2022–23లో రూ.2.88 లక్షలు, 2023–24లో రూ.2.76 లక్షలు, 2024–25లో రూ.38.54 లక్షలు, 2025–26లో రూ.1.82 లక్షల ఆదాయం లభించింది. భద్రాచలం,బూర్గంపాడు, కొత్తగూడెం చెక్‌ పోస్టుల్లో ఆదాయం లేదు. ఇల్లెందు, చర్ల, దమ్మపేట చెక్‌ పోస్టులు ఆదాయం సమకూరుస్తున్నాయి.

సమన్వయం చేస్తే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరు మార్కెట్‌ యార్డులు ఉన్నాయి. ఈ మార్కెట్‌ యార్డులన్నీ బలోపేతం చేసి సరుకు తరలి వెళ్లే రహదారులను గుర్తించి ఆ మార్గాల్లో చెక్‌ పోస్టులు నెలకొల్పితే మార్కెట్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.ఈ మార్కెట్‌ కమిటీలోని చెక్‌ పోస్టులుఆదాయంలభించనివి కూడా ఉన్నాయి. వాటిని తొలగించిఆదాయ మార్గాలు ఉన్న చోట ఏర్పాటు చేస్తే ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా సమన్వలోపం కారణంగా వ్యవసాయ మార్కెట్‌లు క్రయవిక్రయాలు లేకుండా పోతున్నాయి.

మార్కెట్‌ గత ఏడాది ఈ ఏడాది

లక్ష్యం లక్ష్యం

బూర్గంపాడు 5.86 కోట్లు 6.25 కోట్లు

దమ్మపేట 3. 25 కోట్లు 3.67 కోట్లు

ఇల్లెందు 4.64 కోట్లు 5.16కోట్లు

భద్రాచలం 2. 00 కోట్లు 1.94 కోట్లు

కొత్తగూడెం 3. 30 కోట్లు 3.47 కోట్లు

చర్ల 2.62 కోట్లు 2.12 కోట్లు

21.69 కోట్లు 22. 65 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement