
పాత విధానంలోనే పంట రుణాలు ఇవ్వాలి
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 1/70 చట్టం కారణంగా రైతులకు పంట రుణాల జారీలో ఇబ్బందులు ఎదురవుతున్నందున, గతంలో మాదిరి పహా నీల ఆధారంగా రుణాలు ఇవ్వాలని పలుపీఏసీఎస్ల చైర్మన్లు కోరారు. ఈ సందర్భంగా ఖమ్మంలో శుక్రవారం జరిగిన డీసీసీబీ మహాసభలో జిల్లా సహకార అధికారి జి.గంగాధర్, డీసీసీబీ సీఈఓ వెంకట్ఆదిత్యకు వినతిపత్రం అందజేశారు. అలాగే, ఏజెన్సీ రైతులు సహకార బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను రెన్యూవల్ చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ, కొత్తగూడెం, మేడేపల్లి, కొణిజర్ల పీఏసీఎస్ల చైర్మన్లు కొత్వాల శ్రీనివాసరావు, మండే హన్మంతరావు, సామినేని వెంకటేశ్వరరావు, చెరుకుపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.
గిరిజన సంక్షేమ శాఖలో సీఆర్టీల బదిలీ
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధి లోని ఉమ్మడి ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో ఐదేళ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్న ఉపాధ్యాయుల(సీఆర్టీ)ను బదిలీ చేశారు. ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో పనిచేస్తున్న 64మంది సీఆర్టీలకు సబ్జెక్టుల వారీగా శుక్రవారం ఐటీడీఐ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించి సీనియారిటీ ఆధారంగా పోస్టింగ్ ఇచ్చినట్లు డీడీ విజయలక్ష్మి తెలిపారు. ఆ తర్వాత బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 3,5,8వ తరగతుల్లో ప్రవేశానికి అందిన దరఖాస్తుల ఆధారంగా తల్లిదండ్రులు, కమిటీ సభ్యు ల సమక్షాన డ్రా ద్వారా విద్యార్థులను ఎంపిక చేశామని డీడీ వెల్లడించారు. కార్యక్రమాల్లో వైరా ఏటీడీఓ జహీరుద్దీన్, ఏఓ నారాయణ రెడ్డి, ఏసీఎంఓలు రాములు, రమేశ్, హెచ్డబ్ల్యూఓలు హన్మంతరావు, రాంబాబు, రాజేంద ర్, నర్సింహారావు, శ్రీనివాసరావు, ధనుశ్, భద్రాచలం ఎంఈఓ రమతో పాటు అలివేలు మంగతాయారు, రంగయ్య, ప్రసాద్, శ్రీధర్, మణికుమార్, సురేశ్, భద్రం తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడు మృతి
చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రైల్వేస్టేషన్ సమీపాన గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతసాగర్కు చెందిన వట్టికూటి జగదీష్(27) మృతి చెందాడు.ఆయన ద్విచక్ర వాహనంపై ఖమ్మం నుంచి అనంతసాగర్ వస్తుండగా పందిళ్లపల్లి సేషన్ సమీపాన ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జగదీష్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన తండ్రి నాసరయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై నాగుల్మీరా తెలిపారు.