
బీమా చెక్కు అందజేసిన ఎస్పీ
సూపర్బజార్(కొత్తగూడెం): ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కానిస్టేబుల్ టి.అనిల్కుమార్ కుటుంబానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.కోటి చెక్కును ఎస్పీ రోహిత్రాజ్ చేతుల మీదుగా శుక్రవారం అందజేసింది. పోలీస్ వేతన ప్యాకేజీ అకౌంట్ ద్వారా యూనిఫామ్ సర్వీ స్ కస్టమర్ల సంక్షేమానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా ప్రవేశపెట్టిన స్కీం ద్వారా వచ్చిన నగదును అనిల్ కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ సత్యనారాయణ, చీఫ్ మేనేజర్ ఆంజనేయ రమేశ్, బ్రాంచ్ మేనేజర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
‘ఇన్సూరెన్స్’ ద్వారా మరో రూ.కోటి
పాల్వంచ డీఎస్పీ కార్యాలయంలో పోలీస్ కానిస్టేబుల్ తన్నీరు అనిల్కుమార్ 2024, డిసెంబర్లో జరిగినరోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆయన 2022 సెప్టెంబర్లో టాటా ఏఐఏ టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా పాలసీ తీసుకోవడంతో నామినీగా ఉన్న తన్నీరు నాగలక్ష్మి ఈ ఏడాది జనవరి 8న అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించగా.. రూ.కోటి ని ఆమె బ్యాంక్ ఖాతాలో జమచేశారు. కార్యక్రమంలో బీఎం జక్కుల సతీశ్, రాహుల్, నాగేంద్రరెడ్డి, కొచ్చెర్ల కమలారాణి, భూక్య తారాప్రసాద్, డి.శివ ప్రసాద్, రాములు, ఆనంద్వర్ధన్, అనిల్, శివ లీల, సుమన్, నాగలక్ష్మి, పావని, మహేశ్ పాల్గొన్నారు.