
రక్షణ చర్యలు పటిష్టపర్చాలి
సింగరేణి(కొత్తగూడెం): బొగ్గు గనుల్లో ప్రమాదాలు జరగకుండా పటిష్ట రక్షణ చర్యలు అమలు చేయాలని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆ్ఫ్ మైన్స్ సేఫ్టీ(డీడీజీఎంఎస్) టి.ఆర్.కన్నన్ అధికారులకు సూచించారు. స్థానిక ఇల్లెందు గెస్ట్హౌస్లో గురువారం కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లోని గనుల్లో తీసుకోవాల్సిన భద్రత చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కన్నన్ మాట్లాడుతూ.. ఉపరితల గనుల్లో వాహనాలు నడిపేటప్పుడు స్పీడ్ లిమిట్ ఉండాలని, బొగ్గు రవాణా చేస్తున్న టిప్పర్లు, లారీలు కూడా వేగ నియంత్రణ పాటించాలని ఆదేశించారు. మెకానిక్లు వినియోగించే పరికరాలు ఎంతమేరకు సామర్థ్యం కలిగి ఉన్నాయో పరిశీలించాలని సూచించారు. కాలపరిమితి ముగిసిన పరికరాలను తిరిగి పంపించి కొత్తవి సమకూర్చుకోవాలని చెప్పారు. ఎలక్ట్రికల్ వస్తువులు వినియోగించే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. మైన్స్, ఉపరితల గనుల అవవరణల్లో తిరిగే వాహనాల కండిషన్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలని ఆదేశించారు. కార్యక్రమంలో మైన్స్ సేఫ్టీ డైరెక్టర్ అశోక్కుమార్, డీజీఎంఎస్లు సనత్కుమార్, దిలీప్, కమలేష్కుమార్, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ఏరియా జీఎంలు ఎం.శాలేంరాజు, దుర్గం రాంచందర్, కృష్ణయ్య, సేఫ్టీ జీఎం చింతల శ్రీనివాస్, రీజియన్ సేఫ్టీ జీఎం కె.జి.తివారి, ఇతర విభాగాల జీఎంలు సూర్యనారాయణ, రఘురామ్, ప్రెజ్రాల్డ్, తిరుమలరావు, ఎన్.దామోదర్రావు తదితరులు పాల్గొన్నారు.
గనుల్లో ప్రమాదాలు జరగకుండా చూడాలి
మైన్స్ సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కన్నన్