
64 మంది విద్యార్థులు.. ఇద్దరు టీచర్లు
టేకులపల్లి: మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామం బర్లగూడెం (గొల్లగూడెం) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 64 మంది విద్యార్థులు ఉన్నారు. ఉపాధ్యాయులు మాత్రం ఇద్దరే ఉన్నారు. గురువారం కేవలం హెచ్ఎం మాత్రమే హాజరయ్యారు. మరో టీచర్ రాలేదు. రోజూ ఇద్దరు హాజరైతేనే అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఏ రోజైనా ఒక టీచర్ సెలవు పెడితే 64 మంది విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు ఒక్కరూ మాత్రమే బోధించాల్సి వస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి బర్లగూడెం పాఠశాలకు మరో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.