యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

Jun 20 2025 5:45 AM | Updated on Jun 20 2025 5:45 AM

యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

సింగరేణి(కొత్తగూడెం): ఈ నెల 21న సింగరేణివ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, జీఎం పర్సనల్‌ (వెల్ఫేర్‌ అండ్‌ సీఎస్సార్‌) జీవీ కిరణ్‌కుమార్‌ తెలిపారు. గురువారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో అన్ని ఏరియాల పర్సనల్‌ విభాగం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. సంస్థ వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, గనులు , డిపార్ట్‌మెంట్లలోని ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ కార్మికులు పాల్గొని వేడుకలను జయప్రదం చేయాలని కోరారు. కారుణ్య నియామకాల పక్రియ వేగవంతం చేయాలని, చిన్న, చిన్న తప్పిదాలను ఏరియా స్థాయిలోనే సరిచేసి, డిపెండెంట్లకు త్వరితగతిన ఉద్యోగాలు వచ్చేలా చూడాలన్నారు. టర్మినెల్‌ బెనిఫిట్స్‌ చెల్లింపుల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు మురళీధర్‌ రావు, కేశ నారాయణ రావు, బి.శివకేశవ రావు, ముకుంద సత్యనారాయణ, టి. శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement