
మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు
గుండాల: మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం ఓఎస్డీ నరేందర్ హెచ్చరించారు. బుధవారం మండలంలోని దామరతోగు గ్రామం నేతకాని గుంపులో పోలీస్ కమ్యునిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలు ప్రభుత్వానికి సహకరిస్తూ అభివృద్ధి దిశగా పయనించాలని అన్నా రు. అనుమానితులు వస్తే పోలీసులకు సమాచారం చేరవేయాలని సూచించారు. చట్టవ్యవతిరేక కార్యకలాపాలకు పాల్పడి అనవసరంగా జైలుపాలు కావొ ద్దని అన్నారు. అనంతరం 50 కుటుంబాలకు దోమతెరలను పంపిణీ చేశారు. విద్యార్థులకు పెన్నులు, నోట్ పుస్తకాలు ఇచ్చారు. దోమ తెరల పంపిణికీ సహకరించిన ప్రాణిక్ ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, సీఐ రవీందర్, ఎస్సై సైదా రహూఫ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తగూడెం ఓఎస్డీ నరేందర్