తెలంగాణలో తొలిసారి | - | Sakshi
Sakshi News home page

తెలంగాణలో తొలిసారి

Jun 19 2025 4:12 AM | Updated on Jun 19 2025 4:12 AM

తెలంగ

తెలంగాణలో తొలిసారి

జెడ్పీటీసీ పీఠంపై ఆరాటం..

రాజకీయ పార్టీల్లో ఇప్పటికే మండల పరిషత్‌ ఎన్నికల కోలాహలం మొదలైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు తోడు ఆ తర్వాత ఎంపిక చేసే ఎంపీపీ పీఠంపై ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నారు. ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించకపోయినా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో పోటీ తీవ్రంగా ఉండడంతో పలువురు ఆశావహులు ఇటీవల బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. వీరితో పాటుగా సీపీఐ, సీపీఎం, టీడీపీ, బీజేపీ నాయకులు సైతం జిల్లా నాయకత్వాలకు తమ ప్రతిపాదనలు పంపారని సమాచారం.

రాష్ట్ర విభజనతో కనుమరుగు..

భద్రాచలం మండల పరిషత్‌ తొలిసారి జనవరి 1, 1987న ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 42 మంది అధికారులు పూర్తి, ఇన్‌చార్జ్‌ బాధ్యతల్లో పని చేశారు. ఈ మండల పరిషత్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరి సారిగా 2014 జనవరిలో ఎన్నికలు జరగగా, పాలకవర్గ పదవీ కాలం 2018లో ముగిసింది. నాడు 13 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా, చివరి ఎంపీపీగా ఊకా శాంత, జెడ్పీటీసీగా రవికుమార్‌ బాధ్యతలు నిర్వర్తించారు. అయితే 2014 జూన్‌లో రాష్ట్ర విభజన అనంతరం భద్రాచలం మండల కేంద్రం మినహా ఇతర గ్రామాలన్నీ ఏపీలో విలీనం చేశారు. పాలకవర్గ పదవీ కాలం ముగిసిన తర్వాత అభివృద్ధికి సరైన ప్రణాళిక లేక మండల పరిషత్‌ నిర్వీర్యంగా మారింది. దీంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో భద్రాచలం మండల పరిషత్‌ను కొత్తగా ఏర్పాటు చేసిన ఆళ్లపల్లికి తరలించారు. ఇక్కడి ఉద్యోగులను సైతం డిప్యూటేషన్‌పై ఇతర చోట్ల సర్దుబాటు చేశారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక తిరిగి భద్రాచలానికి మండల పరిషత్‌ను కేటాయించారు. దీంతో వెళ్లినట్టే వెళ్లిన మండల పరిషత్‌ మళ్లీ తిరిగి వచ్చింది.

నాడు 13.. నేడు 14 ఎంపీటీసీ స్థానాలు

2014 జనవరి ఎన్నికల్లో భద్రాచలంలో 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఆ తర్వాత జనాభా ప్రాతిపదికన ఒక స్థానం పెంచారు. దీంతో త్వరలో 14 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా భద్రాచలంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 50,088 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 80 వేల నుంచి లక్ష వరకు ఉంటుందని అనధికారికంగా అంచనా వేస్తున్నారు. ఇందులో పురుష ఓటర్లు 19,752, మహిళలు 21,254, ఇతరులు ఇద్దరు కలిపి మొత్తం 41,008 మంది ఓటర్లు ఉన్నారు. 20 వార్డులుగా విభజించగా, ఎన్నికలు సులువుగా నిర్వహించేందుకు 60 పోలింగ్‌ బూత్‌లు సిద్ధం చేశారు. కాగా, మండల పరిషత్‌ కార్యాలయం పూర్తి శిథిలావస్థకు చేరగా, రికార్డులు అత్యధిక భాగం కాలిపోయాయి. ప్రస్తుతం ఎంపీడీఓతో పాటు మరో ముగ్గురు ఉద్యోగులు ఉండగా అందరూ ఇన్‌చార్జ్‌లే. మండల పరిషత్‌ భవనానికి మరమ్మతులు చేపట్టి, పూర్తిస్థాయిలో ఉద్యోగులను నియమిస్తే పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంటుందని స్థానికులు అంటున్నారు.

పూర్వ వైభవం తేవాలి

రాష్ట్ర విభజనతో జరిగన నష్టాల్లో మండల పరిషత్‌ కోల్పోవడం ఒకటి. స్థానికుల కోరిక మేరకు తిరిగి మండల పరిషత్‌ రావటం హర్షణీయం. శిథిలావస్థకు చేరిన ఎంపీడీఓ కార్యాలయాన్ని ఎన్నికలకు ముందే మరమ్మతులు చేయాలి. పూర్తి స్థాయిలో ఉద్యోగులను కేటాయించాలి. త్వరగా ఎన్నికలు నిర్వహించి భద్రాచలాన్ని మళ్లీ అభివృద్ధి బాట పట్టించాలి.

– చల్లగుళ్ల నాగేశ్వరరావు, భద్రాచలం

తరలిపోయి.. తిరిగొచ్చిన మండల పరిషత్‌

పుష్కరకాలం తర్వాత భద్రాచలంలో ఎన్నికలకు సన్నాహాలు

నాడు 13.. నేడు 14 ఎంపీటీసీ స్థానాలు

జెడ్పీటీసీ పీఠంపై ఆశావహుల ఆరాటం

ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో భద్రాచలం మండల పరిషత్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో ఇక్కడున్న మండల పరిషత్‌ తరలిపోయి, మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏర్పాటైంది. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భద్రాచలం మండల పరిషత్‌కు తొలిసారి ఎన్నికలు జరగబోతుండడం విశేషం. దీంతో ఎంపీటీసీలుగా పోటీ చేసేందుకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఇప్పటి నుంచే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. – భద్రాచలం

తెలంగాణలో తొలిసారి1
1/1

తెలంగాణలో తొలిసారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement