
కమనీయం.. కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
జాబ్మేళాకు విశేష స్పందన
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెంలోని వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన లభించిందని జిల్లా ఉపాధికల్పనాఽ శా ఖ అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. సంస్థలో 33పోస్టులు ఖాళీగా ఉండగా, జిల్లా వ్యాప్తంగా 80 మంది హాజరయ్యారని, వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించి 19 మందిని ఎంపిక చేశామని వివరించారు. వారికి కేటాయించిన సెంటర్లలో గడువులోగా విధుల్లో చేరి ఉత్తమ భవిష్యత్కు పునాది వేసుకోవాలని సూచించారు.
ప్రశాంతంగా టీజీ టెట్
సుజాతనగర్: మండలంలోని వేపలగడ్డలో గల అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం నిర్వహించిన టీజీ టెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొదటి షిఫ్ట్లో 120 మంది అభ్యర్థులకు గాను 104 మంది హాజరయ్యారు. రెండో షిఫ్ట్లో 110 మందికి 100 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. రెండు షిఫ్ట్ల్లో కలిపి 26 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు.
మాతా, శిశు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
కొత్తగూడెంఅర్బన్: మాతా, శిశు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ జయలక్ష్మి తెలిపారు. బుధవారం లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమల్లలోని ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫీసును సందర్శించారు. ఎన్జీఓ నిర్వహించిన వివిధ ఆరోగ్య కార్యకలా పాలను పరిశీలించారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన పెంచడంలో, ఆరోగ్య విద్య ప్రాముఖ్యతను వివరించా రు. అనంతరం అల్టాస్రౌండ్ స్కానింగ్ యూని ట్ పనితీరును కూడా తనిఖీ చేసి, సరైన రికార్డులను నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించా రు. చికిత్సకోసం వచ్చిన వారితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫైజ్మోహినుద్దీన్, అజయ్ కుమార్ పాల్గొన్నారు.

కమనీయం.. కల్యాణం

కమనీయం.. కల్యాణం

కమనీయం.. కల్యాణం