
చైన్ స్నాచర్ల అరెస్ట్
పాల్వంచ: బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి మెడలో నుంచి మరో బైక్పై వెళ్తున్న యువకుడు, ఇద్దరు మైనర్లు కలిసి బంగారు చైన్ను చోరీ చేయగా.. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సతీశ్కుమార్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 9న గొల్లగూడెం ఏరియా రేణుకా అపార్ట్మెంట్లో నివాసం ఉండే పెనికలపాటి అబ్రహంపీటర్ బైక్పై బజార్కు వచ్చి సరుకులు తీసు కుని వెళ్తుండగా జూలురుపాడు మండలం మాచినేనిపేట పెద్దతండాకు చెందిన భూక్యా వినోద్, మరో ఇద్దరు మైనర్లు కలిసి స్పోర్ట్స్ బైక్పై వెంబడించారు. ఒడ్డుగూడెం రోడ్లో నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో అబ్రహంపీటర్ మెడలోని బంగారు చైన్ను లాక్కెల్లారు. దీంతో అబ్రహంపీటర్ బైక్ పైనుంచి కింద పడగా, ముగ్గురు పరారయ్యారు. దీంతో సీఐ సతీశ్, ఎస్ఐలు సుమన్, జీవన్రాజ్ ఘటనా స్థలా న్ని పరిశీలించారు. అనంతరం సీసీఎస్ పోలీసులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టి చోరీ చేసిన ముగ్గురిని పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.లక్ష విలువ చేసే 23.6 గ్రాముల బంగారు చైన్ను, మూడు సెల్ఫోన్లు, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. వినోద్ గతంలో కొత్తగూడెం త్రీటౌన్, టుటౌన్ పరిధిలో చైన్ స్నాచింగ్లు, జూలూరుపాడు పరిధిలో మిరప బస్తాలు చోరీ చేసినట్లు విచారణలో తేలిందన్నారు. సమావేశంలో ఎస్ఐలు కల్యాణి, దేవ్సింగ్ పాల్గొన్నారు.