
డిస్ట్రిబ్యూటర్ కెనాళ్లు ఏర్పాటు చేయాలి
పాల్వంచరూరల్: సీతారామ ప్రాజెక్టుకు డిస్ట్రిబ్యూటర్ కెనాళ్లను ఏర్పాటు చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ అన్నారు. మండలంలోని పెద్దమ్మగుడి సమీపంలోని ఓ ఫంక్షన్హాల్లో మంగళవారం జరిగిన జిల్లా వర్క్షాప్లో ఆయిన మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టుకు డిస్ట్రిబ్యూటర్ కెనాళ్లను ఏర్పాటు చేయకపోతే జిల్లా ఎండిపోయే ప్రమాదం ఉందని, జిల్లా నుంచి నీరుపోతున్నా జిల్లాకు చుక్కనీరు ఇవ్వకపోతే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ సమస్యపై ఈ నెల 20 వరకు ఊరూరా గ్రామసభల నిర్వహణ, 30న మండలస్థాయిలో ధర్నాలు, అనంతరం కలెక్టరేట్ను దిగ్బంధిస్తామని వెల్లడించారు. సమావేశంలో మచ్చా వెంకటేశ్వర్లు, అన్నారపు కనకయ్య, అన్నారపు సత్యనారాయణ, ధర్మ, దొడ్డ లక్ష్మీనారాయణ, కొండబోయిన వెంకటేశ్వర్లు, రవికుమార్, సత్యనారాయణ, కేశవరావు, తిరుపతిరావు, శ్రీకాంత్, శంకర్ పాల్గొన్నారు.