
ప్రజా సమస్యలు పరిష్కరించాలి
ములకలపల్లి: ప్రజా సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ములకలపల్లిలో భారీ ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ నుంచి తహసీసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఉపాఽధి కూలీలకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్ట్ సాగునీరు భద్రాద్రి జిల్లాకు ఇచ్చిన తరువాతే ఇతర ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓ గద్దె రేవతి, డీటీ భాగ్యలక్ష్మి, ఎంఏఓ అరుణ్బాబులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నవరపు కనకయ్య, అన్నవరపు సత్యనారాయణ, మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, ఊకంటి రవికుమార్, పొడియం వెంకటేశ్వర్లు, గౌరి నాగేశ్వరరావు, మాలోతు రావూజా, నిమ్మల మఽధు, మంచాల సారయ్య గొగ్గెల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
మార్క్సిజమే మానవాళి విముక్తి మార్గం
సింగరేణి(కొత్తగూడెం): మానవాళి విముక్తికి మార్క్సిజమే మార్గమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బి.వెంకట్ అన్నారు. సోమవారం మంచికంటి భవన్లో కమ్యూనిస్ట్ పితామహుడు కార్ల్మార్క్స్ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ సంపద సృష్టికర్తలు శ్రామికులేనని, వారి శ్రమ ద్వారా లాభాలు వస్తున్నాయని అన్నారు. అమెరికా లాంటి దేశాల్లో ఆర్థిక సంక్షోభాలకు పరిష్కార మార్గాలను మార్క్స్ రాసిన క్యాపిటల్ గ్రంథం చదివి తెలుసుకుంటున్నారని గుర్తుచేశారు.
వ్యవసాయ కార్మిక సంఘం
అఖిల భారత ప్రధాన కార్యదర్శి వెంకట్