
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
అశ్వారావుపేట: అంతర్రాష్ట్ర దొంగను సోమవారం అశ్వారావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ కథనం ప్రకారం... అశ్వారావుపేట ఎస్ఐ అఖిల భద్రాచలం రోడ్లో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ ముత్యాల గణేష్ దొంగిలించిన బైక్తో పరారవుతుండగా పోలీసులు గమనించి పట్టుకున్నారు. విచారించగా గతంలో 10 బైక్లను చోరీ చేసినట్లు తేలింది. అశ్వారావుపేటలో 3, దమ్మపేటలో 1, ఏపీలోని తడికలపూడిలో 6 బైక్లు అపహరించినట్లు తెలిపాడు. పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. సమావేశలో సీఐ నాగరాజు, ఎస్ఐ యయాతి రాజు, ఎస్ఐ అఖిల, సిబ్బంది నాగేంద్రరావు, వెంకటేశ్వరావు, సిబ్బంది ఉన్నారు.