కేంద్రాల్లో తడిసి మొలకెత్తిన ధాన్యం | - | Sakshi
Sakshi News home page

కేంద్రాల్లో తడిసి మొలకెత్తిన ధాన్యం

May 5 2025 8:04 AM | Updated on May 5 2025 8:04 AM

కేంద్

కేంద్రాల్లో తడిసి మొలకెత్తిన ధాన్యం

పాల్వంచరూరల్‌: అకాల వర్షంతో రైతులకు అపారనష్టం వాటిల్లింది. ఆదివారం ఉదయం రెండు గంటలపాటు కురిసిన భారీ వర్షానికి మండలంలో కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కల్లాల్లో ఉన్న మిర్చి కూడా తడిసి ముద్దయింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలవాలింది. భారీ వర్షం కారణంగా సోములగూడెంలో కొనుగోలు కేంద్రంలో వర్షపు నీరు చేసి ధాన్యం తడిసింది. రెడ్డిగూడెం కొనుగోలు కేంద్రం వద్ద మూడు రోజులక్రితం యాస నర్సింహారెడ్డికి చెందిన ధాన్యం కొనుగోలు చేసి గోనె సెంచుల్లో నింపారు. మిల్లుకు తరలించకుండా జాప్యం చేయడంతో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి వడ్లు తడిసి మొలకలు వచ్చాయని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

కేంద్రాల్లో తడిసి మొలకెత్తిన ధాన్యం1
1/1

కేంద్రాల్లో తడిసి మొలకెత్తిన ధాన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement