
ధాన్యంలో తరుగు పేరిట దోపిడీ
చండ్రుగొండ: తరుగు పేరిట ధాన్యం క్వింటాకు 5 నుంచి 7 కేజీల వరకు తరుగు తీస్తున్నారంటూ స్థానిక కొనుగోలు కేంద్రంలో రైతులు శనివారం ఆందోళన చేశారు. పౌరసరఫరాల అధికారులు, మిల్లర్లు కుమ్మకై ్క తమను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి చర్య తీసుకోవాలని కోరారు.
అక్రమ దత్తతపై కేసు నమోదు
అశ్వాపురం: మండలంలోని కురవపల్లి కొత్తూరు గ్రామానికి చెందిన మెస్సా నరసింహారావు, అమల దంపతులు తమ నాలుగో సంతానమైన మూడు నెలల పాపను పెంచుకునే ఆర్థిక స్తోమత లేక తెలిసినవారి ద్వారా దుమ్ముగూడెం మండలానికి చెందిన ఆదిలక్ష్మి, రమేష్ దంపతులకు అక్రమంగా దత్తత ఇచ్చారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ ఫిర్యాదుతో దత్తత ఇచ్చిన, తీసుకున్న తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్ రెడ్డి శనివారం తెలిపారు.