70 లక్షల మొక్కలు నాటాలి | - | Sakshi
Sakshi News home page

70 లక్షల మొక్కలు నాటాలి

May 3 2025 12:07 AM | Updated on May 3 2025 12:07 AM

70 లక్షల మొక్కలు నాటాలి

70 లక్షల మొక్కలు నాటాలి

చుంచుపల్లి: వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో ఈ సారి 70 లక్షల మొక్కలు నాటాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఐటీడీఏ పీఓ రాహుల్‌తో కలిసి మాట్లాడారు. ఈసారి రైతులకు మొక్కలు అందించాలని, ఇంటి ఆవరణ, రహదారుల వెంట, కెనాల్‌ బండ్‌ ప్లాంటేషన్‌ చేపట్టాలని ఆదేశించారు. గ్రామీణ అభివృద్ధి శాఖ 30 లక్షల మొక్కలు, టీజీఎఫ్‌డీసీ శాఖ 12 లక్షలు, అటవీశాఖ 10 లక్షలు, సింగరేణి 10 లక్షలు, ఉద్యానవన శాఖ 5.7 లక్షలు, వ్యవసాయ శాఖ 5 లక్షలు, ఇరిగేషన్‌ 2 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యాలను నిర్దేశించారు. ఎకై ్సజ్‌ శాఖ అధికారులు తాటి, ఈత చెట్లను నాటాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు మునగ మొక్కలు, అటవీశాఖ వెదురు మొక్కలు, విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలల్లో ఔషధ మొక్కలు నాటాలన్నారు. ఇరిగేషన్‌ అధికారులు జిల్లావ్యాప్తంగా ఉన్న కెనాల్‌ బండ్‌ ప్లాంటేషన్‌లో సుబాబుల్‌, వట్టివేర్లు మొక్కలు నాటాలన్నారు. అటవీ శాఖ అధికారి కృష్ణాగౌడ్‌ మాట్లాడుతూ ఆసక్తి గల రైతులకు అటవీ శాఖ నర్సరీల్లో టేకు, ఎరచ్రందనం, వెదురు మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ విద్యా చందన, అధికారులు చంద్రమౌళి, భాస్కర్‌ నాయక్‌, కిషోర్‌, అర్జునరావు, శ్రీనివాసరావు, ఇందిర, తిరుపతయ్య, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పారదర్శకంగా పరిశీలన చేస్తున్నాం

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలిస్తున్నామని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సులు, నీట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహణ, ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ జితేష్‌ హాజరై మాట్లాడారు క్షేత్రస్థాయిలో అధికారులు దరఖాస్తులను పరిశీలించి సంతకం చేయడం ద్వారానే లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. పేదలలో అతి పేదవారికి మాత్రమే లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ట్రైనీ కలెక్టర్‌ సౌరబ్‌శర్మ, కొత్తగూడెం ఆర్డీఓ మధు, హౌసింగ్‌ పీడీ శంకర్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement