
ఆదివాసీలకు అందుబాటులో ఉంటాం..
చర్ల: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని ఆదివాసీలకు నిత్యం అందుబాటులో ఉంటామని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్సింగ్ పేర్కొన్నారు. ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు మంగళవారం మండలంలోని మావోయిస్టు ప్రభావిత గ్రామమైన ఎర్రంపాడులో సీఐ రాజువర్మతో కలిసి కమ్యూనిటీ కనెక్ట్లో భాగంగా ప్రతీ ఇంటిని సందర్శించారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని, దుస్తులు పంపిణీ చేశారు. ప్రతీ గ్రామానికి విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, నిషేధిత మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించవద్దని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐలు నర్సిరెడ్డి, కేశవ్, కార్తీక్ పాల్గొన్నారు.