
ముక్కల గడ్డిని చుట్టేస్తోంది..!
కరకగూడెం: రైతుల వద్ద గడ్డి అందుబాటులో లేనప్పుడు పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది. బేరల్ యంత్రంతో గడ్డి సమస్య కొంతమేర పరిష్కారం అవుతోంది. వరి కోసే సమయంలో ముక్కలైన గడ్డిని ఈ యంత్రం చుట్ట చుడుతూ వృథా కాకుండా చూస్తుంది. వృథా గడ్డిని కాల్చడం ద్వారా ఏర్పడే వాయు కాలుష్యం సైతం తగ్గుతుంది. ఈ యంత్రం ద్వారా గడ్డిని గుండ్రంగా లేదా చతురస్రాకారంలో బేల్స్ తయారు చేయొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. బేరల్ యంత్రం తమకు ఎంతో ఉపయుక్తంగా ఉందని మోతె గ్రామ రైతు వలాద్రి రవీందర్రెడ్డి, రేగళ్లకు ఎందిన కొమరం పాపారావు చెప్పారు. ఈ యంత్రాల కొనుగోలుకు రైతులకు సబ్సిడీపై రుణం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ముక్కల గడ్డిని చుట్టేస్తోంది..!