కేంద్రాల్లో రైతుల నిరీక్షణ | - | Sakshi
Sakshi News home page

కేంద్రాల్లో రైతుల నిరీక్షణ

Apr 29 2025 7:04 AM | Updated on Apr 29 2025 7:04 AM

కేంద్రాల్లో రైతుల నిరీక్షణ

కేంద్రాల్లో రైతుల నిరీక్షణ

పాల్వంచరూరల్‌: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రాశులుపోసి నెల రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు సక్రమంగా జరగడంలేదు. దీంతో రైతులు నిరీక్షిస్తున్నారు. మండల పరిధిలోని రెడ్డిగూడెం కొనుగోలు కేంద్రంలో సుమారు వంద క్వింటాళ్లపైన ధాన్యం నిల్వలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం ధాన్యం కొనుగోలు చేసి తర్వాత నిలిపివేశారు. సోములగూడెం కొనుగోలు కేంద్రం వద్ద శనివారం ధాన్యం కాంటా పెట్టారు. రెండు రోజులుగా కొనుగోళ్లను నిలిపివేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దంతెలబోరు, కారెగట్టు గ్రామాల్లో ఇంతవరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. రోజూ అడపాదడపా వర్షం కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా పీఏసీఎస్‌ సొసైటీ కార్యదర్శి శ్రీనును వివరణ కోరగా.. మిల్లర్లు కిరికిరి పెడుతుండటం, లారీలు అనుకున్న సమయంలో రాకపోవడం వల్ల రెగ్యులర్‌గా కొనుగోళ్లు జరగడంలేదని తెలిపారు.

ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా

జరగడం లేదని ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement