నిత్యాన్నదాన సత్రం వరకు తివాచీ | - | Sakshi
Sakshi News home page

నిత్యాన్నదాన సత్రం వరకు తివాచీ

Apr 28 2025 12:59 AM | Updated on Apr 28 2025 1:11 AM

భద్రాచలం: శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం అధికారులు భక్తుల కోసం ఆలయం నుంచి సత్రం వరకు తివాచీ ఏర్పాటు చేశారు. వేసవి కాలంలో భక్తులు అన్నదాన సత్రానికి నడిచిరావాలంటే తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. దీంతో ఆలయం నుంచి సత్రం వరకు రోడ్డు మీద తివాచీ (మ్యాట్‌)ని పరచగా.. భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.

సెలవులకు ఊరెళ్తే

సమాచారం ఇవ్వండి..

ఎస్పీ రోహిత్‌రాజు

కొత్తగూడెంటౌన్‌: వేసవి సెలవులకు ఊరెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ రోహిత్‌రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరూ లేని ఇంట్లో దొంగతనాలకు పాల్పడేందుకు దుండగులు యత్నిస్తారని, చోరీలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీని ముమ్మరం చేశామని, ఊరికి వెళ్తే దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌లో చిరునామా, ఫోన్‌ నంబర్‌ ఇవ్వాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తక్షణమే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని కోరారు.

వెదురు ఉత్పత్తులు అద్భుతం

భద్రాచలం/చండ్రుగొండ/ములకలపల్లి: వెదురు ఉత్పత్తులతోపాటు ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు తెలిసేలా భద్రాచలంలో ఏర్పాటు చేసిన మ్యూజియం అద్భుతంగా ఉన్నాయని గుల్లాకారి ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు సుస్మిత కనేరి అన్నారు. ఆదివారం ఆమె భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న ట్రైబల్‌ మ్యూజియం, చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు శివారులోని బ్యాంబో క్లస్టర్‌తోపాటు ములకలపల్లి మండలంలోని మాధారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్ట్స్‌, క్రాఫ్ట్‌స్‌ యూనిట్‌ను సందర్శించి మాట్లాడారు. గిరిజన సంప్రదాయ హస్తకళల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. వెదురు ఉత్పత్తుల తయారీలో గిరిజన సంస్కృతి ఉట్టిపడుతోందని, మార్కెటింగ్‌పై కలెక్టర్‌తో చర్చించనున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో వెంకయ్య, వీరస్వామి, హరికృష్ణ, అంజన్‌, ఈసం నాగభూషణం, మల్లం కృష్ణయ్య, బొర్రా సురేశ్‌, వి.గోవర్దన్‌ పాల్గొన్నారు.

లాక్రోస్‌ జాతీయస్థాయి టోర్నమెంట్‌కు కార్తీకరెడ్డి

తల్లాడ: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ నెల 28 నుంచి మే 1వ తేదీ వరకు నిర్వహించనున్న లాక్రోస్‌ 3వ జూనియర్‌, సీనియర్‌ జాతీయస్థాయి టోర్నీలో పాల్గొనేందుకు తల్లాడకు చెందిన డి.కార్తీకరెడ్డి ఎంపికై ంది. తల్లాడకు చెందిన దగ్గుల రామకృష్ణారెడ్డి, విజయలక్ష్మి దంపతుల కుమార్తె కార్తీకరెడ్డి హైదరాబాద్‌లోని గురుకుల పాఠశాలలో 9 వతరగతి చదువుతోంది. క్రీడల్లో కూడా రాణిస్తూ జాతీయ పోటీలకు ఎంపికై ంది. తెలంగాణ జట్టు తరఫున కార్తీకరెడ్డి ఆదివారం బయలుదేరి ఆగ్రా వెళ్లింది.

కాంటాల జ్యాపంపై రైతుల ఆగ్రహం

నేలకొండపల్లి: మండలంలోని రాజారాంపేట ప్రాథమిక సహకార సంఘం పరిధిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇష్టారాజ్యంగా కాంటాలు వేస్తున్నారని రైతులు మండిపడ్డారు. కాంటాల్లో జాప్యం చేస్తున్నారని రైతులు ఆదివారం కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. నెల రోజులుగా కేంద్రంలో ధాన్యం ఆరబెట్టినప్పటికీ కాంటాలు వేయటం లేదని.. కొందరికి మాత్రం అప్పటికప్పుడే వచ్చిన ధాన్యానికి కూడా కాంటాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలను వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ విషయంపై రాజారాంపేట సొసైటీ సీఈఓను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు.

నిత్యాన్నదాన సత్రం వరకు తివాచీ 1
1/1

నిత్యాన్నదాన సత్రం వరకు తివాచీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement