
30 కిలోల గంజాయి పట్టివేత
బూర్గంపాడు: సారపాకలోని ఐటీసీ లారీయార్డులో పార్కింగ్ చేసిన ఓ లారీలో 30 కిలోల గంజాయిని హైదరాబాద్ ఎకై ్సజ్ (ఎస్టీఎఫ్) అధికారులు ఆదివారం పట్టుకున్నారు. ఐటీసీ పేపర్బోర్డుకు జామాయిల్ కర్రను తీసుకొస్తున్న లారీడ్రైవర్ శివ ఒడిశా రాష్ట్రంలో అర్జున్ అనే వ్యక్తిని లారీలో ఎక్కించుకుని సారపాకకు తీసుకొచ్చాడు. ఆ లారీలో గంజాయి ఉందనే పక్కా సమాచారంతో హైదరాబాద్ ఎకై ్సజ్ ఎస్ఐ నాగరాజు సిబ్బందితో సారపాకకు చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం లారీయార్డులో నిలిపి ఉంచిన లారీని తనిఖీ చేయగా అందులో 30 కిలోల గంజాయి దొరికింది. లారీడ్రైవర్ శివతో పాటుగా ఒడిశాకు చెందిన అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు.వారిద్దరూ పలుమార్లు లారీలోగంజాయి తీసుకొచ్చి భద్రాచలంలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. గంజాయి విలువ రూ.15 లక్షలు ఉంటుందని, గంజాయితో పాటు లారీని కూడా సీజ్ చేశామని,శివ, అర్జున్తో పాటు వచ్చిన ప్రహ్లాద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ఎస్సై నాగరాజు తెలిపారు.