
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ములకలపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన ఘటన మామిళ్లగూడెం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. అన్నపురెడ్డిపల్లి మండలం బుచ్చన్నగూడెం గ్రామానికి చెందిన పెద్దారపు రాజేశ్, పలగాని ఉదయ్కిరణ్ (16) ద్విచక్రవాహనంపై భద్రాచలం వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో మండలంలోని మామిళ్లగూడెం సమీపంలో బైక్ కుక్కను ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఉదయ్కిరణ్ ఎగిరి ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. రాజేశ్ స్వల్పగాయాలు కాగా.. ఘటనపై విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.
పురుగులమందు తాగి లారీడ్రైవర్ ఆత్మహత్య
టేకులపల్లి: పురుగులమందు తాగి లారీడ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేందర్ కథనం ప్రకారం.. మండలంలోని మద్రాస్తండాకు చెందిన బాదావత్ బాలు (55) అలియాస్ కృష్ణ లారీడ్రైవర్గా పనిచేస్తున్నాడు. మూడేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి గ్రామంలో ఉన్న తన మొక్కజొన్న చేనులో గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆయన్ను కొత్తగూడెం.. అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు బాదావత్ శ్యాంప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి