
హక్కుల సాధనకు ఐక్యం కావాలి
భద్రాచలంటౌన్: హక్కుల సాధన కోసం గిరిజనులంతా ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని అఖిల భారత ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం అన్నారు. స్థానిక గిరిజన అభ్యదయ భవన్లో ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. రాజ్యాంగంలోని చట్టాల్లో గిరిజనులకు ఉన్న హక్కుల అమలు కోసం అందరినీ ఐక్యం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. గిరిజన సమూహల మధ్య ఉన్న తేడాలు, విభేదాలను మిత్ర వైరుద్యంగానే భావించాలని, హిందుత్వవాదులు, కార్పొరేట్ కంపెనీ యజమానులతో కుమ్మకై ్క అడవిలోని ఖనిజాలతోపాటు ఇతర సంపదను దోచుకుపోతున్నారని ఆరోపించారు. ఎదురు తిరిగితే ‘కగార్’పేరుతో ఆడ, మగ తేడా లేకుండా ఊచకోతకు దిగుతున్నారని విమర్శించారు. అంతకుముందు పట్టణంలో గిరిజన నృత్యాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. సదస్సులో ముర్ర వీరభద్రం, సుర్ణపాక నాగేశ్వరరావు, వేట్ల శాంతన్, కుమార్రెడ్డి, మురళీకృష్ణ, కృష్ణ, ఉదయ్, రజిత, భూద్ర, భూలక్ష్మి, పెంటన్న, చంద్రకళ, రాధ, సురేశ్ పాల్గొన్నారు.