
అడవులను కాపాడుకుందాం
చండ్రుగొండ : అడవులను కాపాడుకోవడం అందరి బాధ్యతగా భావించాలని విజిలెన్స్ డీఎఫ్ఓ ముకుందర్రెడ్డి అన్నారు. మండలంలోని చండ్రుగొండ రేంజ్ పరిధిలో బెండాలపాడు అటవీప్రాంతంలో గురువారం ఆయన పర్యటించారు. మారుజాతి ప్లాంటేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అటవీశాఖ అధికారులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. అడవులను నాశనం చేసుకుంటే భవిష్యత్ తరాలకు మనుగడ ఉండదని హెచ్చరించారు. ఆయన వెంట రేంజర్ ఎల్లయ్య, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
విజిలెన్స్ డీఎఫ్ఓ ముకుందర్రెడ్డి