జూలూరుపాడు: గ్రూప్–3 ఫలితాల్లో మండలంలోని సూరారానికి చెందిన బానోత్ గోపీచంద్ 450 మార్కులకు 279 మార్కులతో 611వ ర్యాంకు సాధించాడు. గ్రూప్–2లోనూ 345వ ర్యాంకు సాధించడం విశేషం. వ్యవసాయ కుటుంబానికి చెందిన మాజీ సర్పంచ్ బానోత్ హరిలాల్ – పార్వతి దంపతుల కుమారుడైన గోపిచంద్ బీటెక్ తర్వాత హైదరాబాద్లో ఉంటూ గ్రూప్స్కు సిద్ధమయ్యాడు. గ్రూప్–1లో మెరుగైన ఫలితం రాకున్నా గ్రూప్–2, 3లో సత్తా చాటాడు. అయితే, గ్రూప్–2 ఉద్యోగం ఎంచుకున్నా ఐఏఎస్ సాధించడమే తన లక్ష్యమని గోపీచంద్ తెలిపాడు.