
●ఆఫ్రిద్.. వరుస ఉద్యోగాలు
సింగరేణి(కొత్తగూడెం): చుంచుపల్లి మండలం రుద్రంపూర్కు చెందిన సింగరేణి కార్మికుడు మహ్మద్ రజాక్ – ఫాతిమా దంపతుల రెండో కుమారుడు ఆఫ్రిద్ వరుసగా ఉద్యోగాలు సాధిస్తున్నాడు. బీఈ మెకానికల్ ఇంజనీరింగ్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేసిన ఆయన గతంలోనే ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఉద్యోగాలు సాధించాడు. అలాగే, గ్రూప్–4లో జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించి ప్రస్తుతం రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తూ గ్రూప్–1లో 448 మార్కులు, గ్రూప్–2లో 377 మార్కులతో రాష్ట్రస్థాయి 313 ర్యాంకు, గ్రూప్–3లో 22వ ర్యాంక్ సాధించడం విశేషం. ఇక జూనియర్ లెక్చరర్ పరీక్షలో రాష్ట్రస్థాయి 21వ ర్యాంక్ సాధించిన ఆఫ్రిద్ పలువురి అభినందనలు అందుకుంటున్నాడు.