కొత్తగూడెంలోని రైతుబజార్, మున్సిపల్ మార్కెట్లలో చాలా మంది వ్యాపారులు పాతకాలం నాటి తరాజులు, బాట్లనే వినియోగిస్తున్నారు. పావు కిలో, అరకిలో బాట్లు లేకున్నా వాటి బదులు టమాటాలు, ఆలుగడ్డలను వాడుతుండడం కనిపించింది. తద్వారా 50 నుంచి 100గ్రాములకు పైగా తేడా వస్తోంది. అలాగే, బాట్లపై ఏటా తూనికలు, కొలతల శాఖ వద్ద స్టాంప్ వేయించాల్సి ఉన్నా ఎక్కడా కానరాలేదు.
జ్యూయలరీ షాపుల్లో ఎలక్ట్రికల్ వేయింగ్ మిషన్లు వాడుతున్నా అవి సరిగ్గా పని చేస్తున్నాయా.. లేదా అనేది స్పష్టత రాలేదు. అధికారులు ఏటా ఓసారి తనిఖీలు చేస్తున్నామని చెబుతున్నా చాలా మిషన్లపై స్టాంప్లు కనిపించలేదు.
ప్రస్తుతం కేజీ మటన్ రూ.800కుపైగానే పలుకుతుండగా మటన్ దుకాణాల్లోనూ పాతకాలం నాటి తరాజులనే వినియోగిస్తున్నారు. దీంతో అటు తూకం, ఇటు నాణ్యత విషయంలోనూ మోసపోతున్నామని వినియోగదారులు వెల్లడించారు. ప్రతీ కేజీ మటన్కు 100 గ్రాములపైగా తేడా వస్తోందని చెప్పారు.
స్టాంప్ లేని బాటుతో కూరగాయాలు తూకం