పాల్వంచరూరల్: మండలంలోని కేశవాపురం – జగన్నాధపురం మధ్య కొలువైన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మ తల్లి) ఆలయ యాగశాలలో పౌర్ణమిని పురస్కరించుకుని చండీహోమం, అమ్మవారి సన్నిధిలో పంచామృతాభిషేకం నిర్వహించారు. తొలుత మేళతాళాల నడుమ అర్చకులు అమ్మవారి జన్మస్థలంలో పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చి చండీహోమం చేశారు. పూజల్లో ఈఓ ఎన్.రజనీకుమారి, అర్చకులు, వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు.
జానకీ సదనానికి
రూ.6లక్షల విరాళం
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యాన నిర్మించే జానకీ సదనంలో ఓ గది నిర్మాణానికి దాతలు శుక్రవారం రూ.6 లక్షల విరాళం అందజేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన ఎన్.కృష్ణదేవరాయులు – అచల దంపతులు, శాంత పార్వతిదేవి, ఎన్.విజయలక్ష్మీదేవి ఉమ్మడిగా చెక్కు రూపంలో విరాళం అందజేశారని అధికారులు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ రమాదేవి, దాతలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
నాణ్యతలో రాజీ పడొద్దు..
● మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలో వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగర్ నీరు అందించడానికి రూ.66కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మంచుకొండ ఎత్తిపోతల పథకం పనులు నాణ్యతగా చేస్తూనే సకాలంలో పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మండలంలోని వీ.వీ.పాలెం వద్ద సాగర్ ప్రధాన కాల్వకు ఆనుకుని నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పంప్హౌస్ పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఉగాది నాటికి ట్రయల్ రన్ జరిపేలా పనుల్లో వేగం పెంచాలని, ఏక కాలంలో పంప్హౌస్, పైపులైన్ పనులు చేపడితే సకాలంలో పూర్తవుతాయని తెలిపారు. తద్వారా సాగర్ జలాలను మండలంలోని చెరువుల్లో నింపొచ్చని మంత్రి పేర్కొన్నారు.
వైభవంగా చండీహోమం, అభిషేక పూజలు
వైభవంగా చండీహోమం, అభిషేక పూజలు