‘ప్రకృతి’ సభలకు రండి | - | Sakshi
Sakshi News home page

‘ప్రకృతి’ సభలకు రండి

Mar 14 2025 12:56 AM | Updated on Mar 14 2025 12:53 AM

కలెక్టర్‌కు ప్రకృతి ప్రేమికుల ఆహ్వానం

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): కొత్తగూడెం ప్రకృతి ఆశ్రమంలో ఈనెల 23న నిర్వహించనున్న ప్రకృతి ఆరోగ్య మహాసభలకు హాజరు కావాలని కోరుతూ కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌కు గురువారం ప్రకృతి ప్రేమికులు ఆహ్వానించారు. జిల్లాలో ప్రకృతి పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న పాటిల్‌ను ఈ మహాసభలకు హాజరై సందేశం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఆశ్రమ సభ్యులను అభినందించిన కలెక్టర్‌.. సభలకు హాజరవుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్‌ గ్రీన్‌ అంబాసిడర్‌ మొక్కల వెంకటయ్య, సభల కో ఆర్డినేటర్‌ జి.సుగుణారావు, మొక్కల రాజశేఖర్‌, బంగారి శంకర్‌, దయానందసాగర్‌, రాజేష్‌ పాల్గొన్నారు.

ఐటీఐకి అనువైన స్థలం గుర్తించాం..

గ్రామీణ నియోజకవర్గాల్లో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుపై రాష్ట్ర ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సంజయ్‌కుమార్‌ గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌.. అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌తో కలిసి హాజరై జిల్లా వివరాలు వెల్లడించారు. అశ్వారావుపేటలో ఐటీఐ స్థాపనకు అనువైన స్థలాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఆ స్థలం రహదారికి సమీపంలో ఉందని, ఆర్టీసీ రవాణా సౌకర్యం కూడా ఉందని చెప్పారు. సమీపంలో పరిశ్రమలు కూడా ఉన్నాయన్నారు. అశ్వారావుపేట రాష్ట్రంలోనే ఆయిల్‌పామ్‌కు హబ్‌గా ఉందని, ఇక్కడ వ్యవసాయ కళాశాల కూడా ఉన్నందున ఐటీఐలో వ్యవసాయ సంబంధిత కోర్సులు ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. దీంతో ఎలాంటి కోర్సులు ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులకు ఎక్కువ లాభం చేకూరుతుందో తగిన నివేదికలను అందజేయాలని ప్రిన్సిపల్‌ సెక్రటరీ కలెక్టర్‌కు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement