బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Nov 27 2025 6:31 AM | Updated on Nov 27 2025 6:31 AM

బాపట్

బాపట్ల

గురువారం శ్రీ 27 శ్రీ నవంబర్‌ శ్రీ 2025 అమరేశ్వరాలయంలో విశేష పూజలు అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలో సుబ్రహ్మణ్యషష్టి సందర్భంగా దేవాలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం వేకువజామున స్వామి వారికి భక్తుల సమక్షంలో అర్చకులు శంకరమంచి రాజశేఖరశర్మ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం నుంచి పదకొండు గంటల వరకు అర్చకులు అభిషేకాలు చేశారు. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకుని పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానం ఆచరించారు. ఆలయంలోని సుబ్రహ్మణ్వేశ్వరునికి పూజలు చేశారు. అనంతరం అమరేశ్వరుడిని దర్శించుకున్నారు. సుబ్రహ్మణ్య షష్టి ప్రత్యేక పూజలలో పలు గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఏఎన్‌ఎంలకు వైద్య విధులే కేటాయించాలి గుంటూరు మెడికల్‌: సచివాలయ ఏఎన్‌ఎంలకు వైద్య విధులతోపాటు పంచాయతీ సంబంధిత పనులు కూడా అప్పగించడంతో వారు సతమతం అవుతున్నారని ఏపీ హంస జిల్లా అధ్యక్షుడు బి.నాగవర్ధన్‌ తెలిపారు. ఈ మేరకు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేశారు. సచివాలయ ఏఎన్‌ఎంలను వైద్య ఆరోగ్యశాఖకు చెందిన విధులు మాత్రమే నిర్వహించేలా చూడాలని డీఎంహెచ్‌ఓను కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.కిరణ్‌, జిల్లా, సిటీ నేతలు ఎండీ షరీఫ్‌, నరేంద్ర బాబు, నరసింహారావు, వెంకట్‌ తదితరులు ఉన్నారు. జిల్లా కోర్టులో బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల కోలాహలం వైదిక మార్గంతోనే లోకహితం సాక్షి ప్రతినిధి, బాపట్ల: చుండూరు మండలం చిన్నపరిమి గ్రామానికి చెందిన రైతు తమ్మా పాములరెడ్డి 14 ఎకరాల సొంత పొలం, మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశారు. కౌలుతో కలిపి రూ. 8 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఇప్పటికి 18 ఎకరాలు కోత పూర్తయింది. ధాన్యం మొత్తం రోడ్లపైనే పోశారు. ప్రభుత్వం మద్దతు ధరకు సక్రమంగా ధాన్యం కొనడం లేదు. వేచి చూసి అమ్ముకుందామన్నా మూడు నాలుగు రోజులు ధాన్యం ఆరబెట్టాలి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వర్షం వచ్చే సూచనలు కనిపిస్తుండడంతో ఆకాశం మబ్బులతో నిండింది. ధాన్యం ఆరే పరిస్థితి లేదు. తేమశాతం 17 లోపు ఉంటేనే ధాన్యం కొంటామని ప్రభుత్వం ఽచెబుతోంది. వర్షం వస్తే తడిసి ధాన్యం పనికిరాకుండా పోతుంది. అమ్ముదామంటే నిన్నటివరకూ 75 కిలోల బస్తా రూ. 1,450కి కొన్న దళారులు ఇప్పుడు రూ.1,330కే అడుగుతున్నారు. ఈ ధరతో అమ్మితే కౌలు ఖర్చులు కూడా రావు. ఉంచుదామంటే ధాన్యం దాచుకునే వసతి లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదని రైతు పాములరెడ్డి ఆవేదన చెందుతున్నారు. ఇదే పరిస్థితి జిల్లాలోని వరి రైతులది. వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో కోతతోపాటు కోత దశలో ఉన్న వరి రైతులందరు వాన భయంతో వణికిపోతున్నారు. తుపాను వస్తే ఆరబెట్టే వసతి లేక నష్టపోతామని లబోదిబో అంటున్నారు. జిల్లాలో ఖరీప్‌లో 2,91,106 ఎకరాల్లో వరి సాగు చేయగా 6,55,212 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా కట్టింది. వాస్తవానికి ఇంతకు మించి సాగు ఉంటుందని, 7 లక్షల టన్నులకు తగ్గకుండా దిగుబడి ఉంటుందన్నది అంచనా. ప్రభుత్వం కేవలం 2 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే రైతుల నుంచి సేకరించనున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ అధికారులు ఆ దిశగా ఏర్పాటు చేయలేదు. ఇప్పటికే వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు, భట్టిప్రోలు, అమృతలూరు మండలాల్లో వరి కోతలు మొదలయ్యాయి. జిల్లాలో 117 ధాన్యం కొలుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, 74 ఽరైస్‌ మిల్లుల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ కొనుగోళ్లు వేగవంతం కాలేదు. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావంతో వర్షాలు కురిస్తే తీవ్రంగా నష్టపోతామని రైతులు భయపడుతున్రాను. ప్రభుత్వం రైతులకు టార్పాలిన్‌ పట్టలు ఇస్తామని చెప్పి మొండిచేయి చూపడంతో వర్షం వస్తే ధాన్యం దాచుకునే వీలు అన్నదాతలకు లేకుండా పోయింది. పాలనలో వైఫల్యం చంద్రబాబు పాలన వైఫల్యంతో యూరియా, ఇతర ఎరువుల కొరత వల్ల వరి సాగు సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తరువాత వచ్చిన తుపానులు, అధిక వర్షాలు పంట దెబ్బతినేలా చేశాయి. దీంతో ఖరీఫ్‌లో వరి దిగుబడులు తగ్గాయి. గతంలో ఎకరాకు 35 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి వస్తుండేది. గత ఖరీఫ్‌లో ఎకరానికి 25 నుంచి 30 బస్తాలకు మించి దిగుబడి వచ్చే పరిస్థితి లేదు.

న్యూస్‌రీల్‌

వైఎస్‌ జగన్‌ హయాంలో భేష్‌

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ధాన్యం తడిసినా ఇతరత్రా కారణాలతో పాడైనా ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనేది. వర్షాల సమయంలో రైతులకు టార్పాలిన్‌ పట్టలు అందజేసింది. బయట మార్కెట్‌లోనూ అన్ని పంటల ధర మద్దతు ధర అంత ఉండేది. వరి ధాన్యం రూ. 2 వేలు అమ్మింది. మిర్చి క్వింటా రూ. 20 వేలు, పొగాకు రూ. 18 వేలకు విక్రయించారు. అన్ని రకాల ధాన్యం, ఇతర పంటల ధరలు రైతులకు గిట్టుబాటు కల్పించాయి.

ఎంపీ సమాధానం చెప్పాలి

సాగర్‌ నీటిమట్టం

పులిచింతల సమాచారం

పశ్చిమ డెల్టాకు నీటి విడుదల

పీజీ ఫలితాల్లో కీర్తికి రాష్ట్ర ప్రథమ ర్యాంక్‌

గురువారం శ్రీ 27 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

గుంటూరు లీగల్‌ : ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి బుధవారం గుంటూరు జిల్లా కోర్టులో న్యాయవాదులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. కౌన్సిల్‌ మెంబర్‌గా పోటీ చేస్తున్న హైకోర్టు అడ్వకేట్‌ కొమ్మసాని శ్రీనివాసరెడ్డి గుంటూరు విచ్చేశారు. జిల్లా కోర్టులో న్యాయవాదులను కలిసి తన అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలిపించాలని కోరారు. న్యాయవాదులు పెద్ద సంఖ్యలో ఆయన వెంట ఉన్నారు.

తెనాలి: జనబాహుళ్యం వైదిక మార్గాన్ని అనుసరించినప్పుడే లోకానికి హితం చేకూరుతుందని జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతులు శ్రీవిద్యాశంకర భారతీస్వామి స్పష్టం చేశారు. పట్టణ నాజరుపేటలోని విద్యాశంకర భారతి నృసింహ సదనాన్ని బుధవారం భారతీస్వామి సందర్శించారు. వేదిక్‌ బ్రాహ్మణ సేవాసమాఖ్య పర్యవేక్షణలో నిర్మించిన నృసింహ సదనాన్ని సందర్శించాక, సంతోషం వ్యక్తం చేశారు. భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. ధార్మిక ప్రచారకర్త అబ్బూరి వెంకాయమ్మ పీఠానికి రాసిచ్చిన స్థలాన్ని నృసింహ సదనానికి ఇచ్చినట్టు తెలిపారు. సమాఖ్య అధ్యక్షులు అమ్మన్ని సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి, తాడేపల్లి నాగ సుబ్రహ్మణ్యం, కుందేటి సుబ్రహ్మణ్యం కామేశ్వరరావు, తాడేపల్లి శివకుమార్‌, నందివెలుగు విజయసారథి, మేడూరి శ్రీనివాసమూర్తి, దీవి లక్ష్మీ నరసింహాచార్యులు, దీవి జీవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

7

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం

ఆరు రోజులుగా జిల్లాలో మబ్బులు

వేమూరు, రేపల్లెల్లో 40 వేల

ఎకరాల్లో కోతలు

రోడ్లపైనే ధాన్యం ఆరబెడుతున్న రైతులు

మొక్కుబడిగా కూడా ధాన్యం

కొనని చంద్రబాబు ప్రభుత్వం

వర్షం వస్తే తీవ్ర నష్టం తప్పదని

అన్నదాతల ఆందోళన

ఇప్పటికే మోంథా తుపానుతో

నష్టపోయిన రైతులు

జెడ్పీటీసీల ప్రమేయం లేకుండా రూపొందించిన ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ ఆమోదం పొందకుండా తాము ఆరు నెలలపాటు అడ్డుకున్నామని తెలిపారు. అయితే జెడ్పీటీసీలకు తెలియకుండా ఎటువంటి పనులు ఆమోదం పొందవని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన హామీతో తాము సర్వసభ్య సమావేశపు అజెండాను ఆమోదించామని తెలిపారు. కానీ ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలోనే ఏకపక్షంగా పనులు ఆమోదింప చేసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తమకు సమాధానం చెప్పాలన్నారు. కమీషన్లు తీసుకుని పనులు ఆమోదిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. జెడ్పీని సొంత జాగీరుగా మార్చుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జెడ్పీలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన కొనసాగుతోందని ఆరోపించారు. ఈ సమావేశంలో కందుల సిద్ధయ్య, సంకటి నాగమల్లేశ్వరి, షేక్‌ గుల్జార్‌ బేగం, మూలగొండ్ల కృష్ణకుమారి, తుమ్మల సుబ్బారావు, తుమ్మా విజయప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం బుధవారం 582.20 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 11,856 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2వేల క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు అంతే వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 42.1600 టీఎంసీలు.

దుగ్గిరాల: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ డెల్టాకు 3,422 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటి మట్టం ఉంది.

వాన రూపంలో పొంచి ఉన్న ప్రమాదంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వరి కోతలు మొదలై ధాన్యం ఆరబెట్టుకుంటున్న ఈ తరుణంలో చినుకు ఎప్పుడు పడుతుందోనని వణుకుతున్నారు. చంద్రబాబు సర్కారు ధాన్యం సరిగా సేకరించకపోవడం, కొన్న కొద్ది ధాన్యం విషయంలోనూ అడ్డగోలు కొర్రీలు పెట్టడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

గుంటూరు మెడికల్‌: గుంటూరు జిల్లాలోని కాటూరి మెడికల్‌ కాలేజ్‌ సామాజిక వైద్య విభాగం పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్‌ వేమూరి కీర్తికి పరీక్ష ఫలితాల్లో స్టేట్‌ ఫస్ట్‌ లభించింది. ఈ మేరకు బుధవారం కళాశాల యాజమాన్యం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించింది. పీజీ పరీక్షా ఫలితాల్లో 800 మార్కులకుగాను డాక్టర్‌ వి.కీర్తికి 594 మార్కులు వచ్చాయని కళాశాల యాజమాన్యం తెలిపింది. కమ్యూనిటీ మెడిసిన్‌లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన డాక్టర్‌ కీర్తికి కళాశాల చైర్మన్‌ కాటూరి సుబ్బారావు, డైరెక్టర్‌ డాక్టర్‌ స్వైరారావు, డీన్‌ డాక్టర్‌ సి.హెచ్‌.మోహన్‌రావు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.చైతన్యలు అభినందనలు తెలిపారు.

బాపట్ల1
1/10

బాపట్ల

బాపట్ల2
2/10

బాపట్ల

బాపట్ల3
3/10

బాపట్ల

బాపట్ల4
4/10

బాపట్ల

బాపట్ల5
5/10

బాపట్ల

బాపట్ల6
6/10

బాపట్ల

బాపట్ల7
7/10

బాపట్ల

బాపట్ల8
8/10

బాపట్ల

బాపట్ల9
9/10

బాపట్ల

బాపట్ల10
10/10

బాపట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement