ఐదుకు చేరిన మృతుల సంఖ్య | - | Sakshi
Sakshi News home page

ఐదుకు చేరిన మృతుల సంఖ్య

Jul 25 2025 4:44 AM | Updated on Jul 25 2025 4:44 AM

ఐదుకు చేరిన మృతుల సంఖ్య

ఐదుకు చేరిన మృతుల సంఖ్య

కనమర్లపూడి ప్రమాదంలో గాయపడిన

చికిత్స పొందుతూ మహిళ మృతి

శావల్యాపురం: మండలంలోని కనమర్లపూడి గ్రామం జాతీయ రహదారిపై ఈనెల 21న జరిగిన మినీ వాహనం, ఆటో ఢీకొన్న ఘటనలో మరొకరు మృతిచెందారు. ఘటనలో బత్తుల యశోదకుమారి (29) రెండు కాళ్లు విరిగిపోయి తీవ్రగాయాలతో గుంటూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు శావల్యాపురం ఎస్‌ఐ లేళ్ల లోకేశ్వరరావు తెలిపారు. గుంటూరులో మృతదేహానికి పంచనామా నిర్వహించి, అనంతరం బంధువులకు అప్పగించారు. ఘటనలో ఇప్పటికే నలుగురు దుర్మరణం చెందగా, యశోదకుమారి మృతితో మృతుల సంఖ్య ఐదుకు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement