
బీచ్ కబడ్డీ పురుషుల రాష్ట్ర జట్టుకు శిక్షణ
చెరుకుపల్లి: జూన్ 5 నుంచి 8వ తేదీ వరకు మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్లో నిర్వహించనున్న 12వ జాతీయ బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర పురుషుల జట్టుకు శిక్షణ ఇస్తున్నట్టు ఏపీ కబడ్డీ అసోసియేషన్ కోశాధికారి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి ఎం.సుబ్బరాజు తెలిపారు. జట్టుకు మండలంలోని పొన్నపల్లి గ్రామంలో శిక్షణ శిబిరాన్ని బుధవారం సుబ్బరాజు ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 3వ తేదీ వరకు శిక్షణ కొనసాగనున్నట్లు తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన కుంచల శ్రీనివాసరెడ్డి స్పాన్సర్గా వ్యవహరించనున్నట్టు చెప్పారు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ వై.శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించన్ను పోటీలకు పురుషుల జట్టుకు పర్యవేక్షకులుగా విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు వైఎస్సార్ ప్రసాద్, రాధాకృష్ణమూర్తి వ్యవహరిస్తారని తెలిపారు. శిబిరానికి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరి జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరు అయ్యారని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం తుది జట్టును ఎంపిక చేయనున్న వివరించారు.