కర్రసాములో జిల్లా క్రీడాకారుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

కర్రసాములో జిల్లా క్రీడాకారుల ప్రతిభ

May 28 2025 11:43 AM | Updated on May 28 2025 11:43 AM

కర్రసాములో జిల్లా క్రీడాకారుల ప్రతిభ

కర్రసాములో జిల్లా క్రీడాకారుల ప్రతిభ

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): కర్రసాము అంతర్జాతీయ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచినట్లు కాశీనాథ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీ నిర్వాహకుడు కాశీనాథ్‌ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన పోటీల్లో వారు ప్రతిభ చూపారన్నారు. అంతర్జాతీయ కర్రసాము సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 9 బంగారు, 5 రజత, 3 కాంస్య పతకాలు సహా మొత్తం 17 పతకాలను చిన్నారులు సాధించారని పేర్కొన్నారు. సాయి సుబ్రహ్మణ్యం, విజయ్‌ శిక్షణలో చిన్నారులు ఈ విజయం సాధించారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement