గంజాయి నిందితుల పట్టివేత | - | Sakshi
Sakshi News home page

గంజాయి నిందితుల పట్టివేత

Oct 30 2025 8:01 AM | Updated on Oct 30 2025 8:01 AM

గంజాయ

గంజాయి నిందితుల పట్టివేత

పెద్దతిప్పసముద్రం : స్థానిక బి.కొత్తకోట రోడ్డులో ఎస్‌ఐ హరిహరప్రసాద్‌, సిబ్బంది బుధవారం నాకా బందీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ము గ్గురు యువకులు ద్విచక్ర వాహనంలో వస్తూ పో లీసులను చూసి అనుమానాస్పదంగా తచ్చాడా రు. పోలీసులు సదరు వాహనాన్ని క్షుణంగా తని ఖీ చేయగా సుమారు అరకిలో గంజాయి పట్టుబడినట్లు సమాచారం. కురబలకోట మండలం ముదివేడు సమీపంలోని మట్లివారిపల్లికి చెందిన రాజోళ్ల హరీష్‌ (29), మదనపల్లిలోని రామారావ్‌ కాలనీకి చెందిన ఫరూక్‌(19)లతోపాటు మరో మైనర్‌ యువకుడు గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టు బడినట్లు తెలుస్తోంది. తహసీల్దారు శ్రీరాములు నాయక్‌, వీఆర్వో నరేంద్రల సమక్షంలో పోలీసులు పట్టుబడిన గంజాయిని సీజ్‌ చేసి నిందితులపై కేసు నమోదు చేశారు.

బొలెరో వాహనం బోల్తా

చిన్నమండెం : మండల కేంద్రంలోని దేవపట్ల క్రాస్‌రోడ్డు వద్ద బుధవారం తెల్లవారుజామున బొలెరో వాహనం వెనుక టైరు పగలడంతో అదుపు తప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో అటుగా ఏ వాహనం రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మదనపల్లి వైపు నుంచి కడపకు నారు వేసుకొని వస్తున్న బొలెరో వాహనం దేవపట్ల క్రాస్‌ రోడ్డు వద్దకు వచ్చేసరికి వెనుకవైపు టైర్‌ పగిలి అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తోపాటు ఎవరికీ చిన్నగాయాలు కూడా కాలేదు.

యువకుడి ఆత్మహత్య

పెద్దతిప్పసముద్రం : మండలంలోని బూర్లపల్లికి చెందిన పీ.సతీష్‌ కుమార్‌ (22) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పుకు ఉన్న కొక్కీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి వెంకట్రమణ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ హరిహరప్రసాద్‌ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువకుడి మృతికి అనారోగ్య సమస్యలా, వేరే ఇతర కారణాలా పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది.

మద్యం తాగి వ్యక్తి మృతి

రామాపురం : మండలంలోని రాచపల్లి పంచాయతీ ఎగువఉప్పరపల్లెకు చెందిన టేకూరి లక్ష్మినారాయణ (62) మంగళవారం రాత్రి అతిగా మద్యం తాగి కిందపడి మృతి చెందారు. మద్యం తాగిన లక్ష్మినారాయణ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించి వేంకటేశ్వర స్కూల్‌ సమీపంలో కిందపడిపోయాడు. బుధవారం తెల్లవారుజామున మండల కేంద్రానికి వచ్చేవారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థలానికి చేరుకొని పరీశీలించారు. తలకు బలమైన గాయం కావడంతో మృతిచెందాడని ఎస్సై వెంకట సుధాకర్‌రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

గంజాయి నిందితుల పట్టివేత1
1/1

గంజాయి నిందితుల పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement