న్యూయార్క్లో ఎంపీ మిథున్రెడ్డికి ఘన స్వాగతం
రాజంపేట : ఐక్యరాజ్యసమితి సమావేశాలకు భారత్ తరపున వెళ్లిన బృందలోని అన్నమయ్య జిల్లా రాజంపేట ఎంపీ, లోక్సభ వైఎస్సార్సీపీ ఫ్లోర్లీడర్ పీవీ మిథున్రెడ్డికి న్యూయార్క్లో ఘన స్వాగతం లభించింది. ఈ విషయాన్ని జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ యువనేత చిల్లా కిరణ్ తెలిపారు. వచ్చేనెల 1న జరిగే ఐక్యరాజ్యసమితి సమావేశానికి ఈనెల 25న ఎంపీ మిథున్రెడ్డి యుఎస్ఏకు వెళ్లారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, వైఎస్సార్ అభిమానులు ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసి బొకేలను అందచేసి స్వాగతించారు.


