కమనీయం..కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కమనీయం..కల్యాణం

Oct 23 2025 2:30 AM | Updated on Oct 23 2025 2:30 AM

కమనీయం..కల్యాణం

కమనీయం..కల్యాణం

గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ నరసింహాస్వామి కల్యాణోత్సవం బుధవారం టీటీడీ వారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఆలయంలో కల్యాణమండపం వద్ద చలువపందిళ్లు, పచ్చని తోరణాలతో పెళ్లివేదికను అందంగా అలంకరించారు. ముందుగా మూలవర్లకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు జరిపారు.రంగురంగుల పుష్పాలతో స్వామివార్లను అలంకరించారు.ముత్యాల తంబ్రాలతో స్వామివారి పెళ్లివేడుక నిర్వహించారు. వేదపండితులు మంత్రోచ్ఛారణల మధ్య మేళతాళాలతో శాస్త్రోక్తంగా మాంగల్యధారణ కావించారు. కల్యాణోత్సవం సందర్భంగా యజ్ఞహోమాలు నిర్వహించారు. రూ.300 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు టీటీడీ వారు పట్టువస్త్రాలు, కంకణాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయఅర్చకులు గోపాలాబట్టర్‌, కృష్ణస్వామి, గోకుల్‌స్వామి, రాజుస్వామి, టీటీడీ అధికారులు పాల్గోన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement