
అన్నమయ్య జలాశయం పరిశీలన
రాజంపేట : అన్నమయ్య జలాశయాన్ని నిపుణుల బృందం ఆదివారం పరిశీలించింది. ప్రధానంగా జలాశయం ప్రస్తుత స్ధితి గతులపై అంచనా వేసింది. ఈ బృందంలో డిజైన్ ఎక్స్ఫర్ట్గా పీపీఏ చీప్ ఇంజనీర్ రమేష్కుమార్, హైడ్రో మెకానికల్ ఎక్స్ఫర్ట్గా రిటైర్డ్ చీప్ ఇంజనీర్ కే.సత్యనారాయణ, జియాలిజిస్టుగా జీఎస్ఐ డైరక్టర్ జనరల్(రిటైర్డ్) ఎం.రాజు, డిజైన్ అప్రూవింగ్ అథారిటి గా సెంట్రల్ డిజైన్ ఆర్గనై జేషన్, డబ్ల్యూఆర్డీ చీఫ్ ఇంజినీర్, హైడ్రాలజీ ఎక్స్ఫర్ట్గా విజయవాడకు చెందిన హైడ్రాలజీ ఛీప్ ఇంజినీర్, కన్వీనర్గా కడప డబ్ల్యూఆడీ చీఫ్ ఇంజినీర్లు ఉన్నారు. ప్రభుత్వం అన్నమయ్య జలాశయం డిజైన్ చేసేందుకు సాంకేతిక నిపుణుల బృందాన్ని పంపించింది. జలాశయం పునర్నిర్మాణానికి సంబంధించి డిజైన్, నిర్మాణం తదితర అంశాలపై టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ దృష్టి సారించింది. కార్యక్రమంలో అన్నమయ్య జలాశయం అధికారులు పాల్గొన్నారు.