
ఖాజావలి కుటుంబానికి అండగా ఉంటాం
రాయచోటి టౌన్ : భవనం పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాయపాటి ఖాజావలి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని అన్నమయ్య జిల్లా విద్యాసాగర్ నాయుడు అన్నారు. ఖాజావలి కడప పట్టణంలోని అశోక్ నగర్లో తన ఇంటిపై తన భార్యతో కలిసి తాల్బార్ పట్ట కప్పేప్రయత్నంలో ఇంటి పైకప్పు సిమెంట్ రేకులు పగిలి కిందపడ్డాడన్నారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందాడన్నారు. ఆయనకు భార్య మాబున్నిసాతో పాటు నలుగురు ఆడపిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. వారి కుటుంబానికి పోలీస్ శాఖ అండ ఉంటుందని చెప్పారు. అంతకు ముందుగా పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. దహన సంస్కారాల కోసం రూ.1లక్ష నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ యం. శ్రీనివాసులు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ యం. పెద్దయ్య, అన్నమయ్య, కడప పోలీసులు పాల్గొన్నారు.