మతసామరస్యానికి ప్రతీక మొహర్రం | - | Sakshi
Sakshi News home page

మతసామరస్యానికి ప్రతీక మొహర్రం

Jun 28 2025 8:11 AM | Updated on Jun 28 2025 8:11 AM

మతసామరస్యానికి ప్రతీక మొహర్రం

మతసామరస్యానికి ప్రతీక మొహర్రం

రాజంపేట టౌన్‌ : ఇస్లాం క్యాలెండర్‌ ప్రకారం గురువారం రాత్రి నెలవంక దర్శనమివ్వడంతో నూతన సంవత్సరం ప్రారంభమైంది. మొదటి నెల మొహర్రం కావడంతో హజ్రత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ బలిదానం జ్ఞాపకార్థం పదిరోజుల పాటు సంతాప కార్యక్రమాలు జరుపుకుంటారు. అందువల్ల శుక్రవారం జిల్లాలోని వివిధ పట్టణాల్లో అనేక గ్రామాల్లో పీర్ల చావిడిలలో పీర్లను కొలువుదీర్చారు. ఇదిలావుంటే మొహర్రం నెలలోనే ఇస్లాం మత ప్రవక్త మహమ్మద్‌ రసూలల్లా సొల్లేల్లాహు అలైహి వసల్లం మనవళ్లు ఇస్లాం మత వ్యాప్తి కోసం కర్బాలా మైదానం (సౌదీ)లో పది రోజుల పాటు యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో వారి వంశానికి చెందిన 72 మంది అసువులు బాసి వీరమరణం పొందారు. వారిని స్మరించటానికి ప్రతి ఏడాది మొహర్రం నెలలో పది రోజుల పాటు కార్యక్రమాలు చేస్తారు. అందులో భాగంగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పీర్లు కొలువుదీరాయి. ఈసందర్భంగా పీర్లను కొలిచేవారు చదివింపులు చేసి ప్రార్థనలు చేస్తారు.

మత సామరస్యానికి ప్రతీక..

మొహర్రం మత సామరస్యానికి ప్రతీక అని చెప్పాలి. అనేక గ్రామాల్లో మొహర్రం ను హిందువులే ముందు ఉండి జరిపిస్తారు. కొన్ని గ్రామాల్లో హిందువుల ఇంటి నుంచి పీర్లు వెళ్ళడం, కొన్ని సాంప్రదాయమైన కార్యక్రమాలు సైతం హిందువులే చేపడతారు. ఈ సాంప్రదాయాలన్నీ కూడా అనాదిగా వస్తున్నాయి. పీర్ల పండుగను పురస్కరించుకొని చేపట్టే సాంప్రదాయమైన కార్యక్రమాలను హిందు, ముస్లీంలు గౌరవంగా కూడా భావిస్తారు. ఇక ధనవంతులు పీర్ల వేడుకకు లక్షలాది రూపాయిలు కూడా వెచ్చిస్తారు. ఈసందర్భంగా ప్రజా ప్రతినిధులను, రాజకీయ నాయకులను సైతం ఆహ్వానించి అట్టహాసంగా పీర్ల పండుగ నిర్వహిస్తారు.

గ్రామాల్లో కోలాహల వాతావరణం

మొహర్రం సందర్భంగా పట్టణాల్లోకంటే గ్రామీణ ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. పలు ప్రాంతాల్లో పీర్ల వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తారు. అందువల్ల ఆయా గ్రామాల ప్రజలు తమ బంధువులను, మిత్రులను, ఆత్మీయులను సైతం మొహర్రంకు ఆహ్వానిస్తారు. ఇక ప్రజలు ఒక కుటుంబ సభ్యుల్లా రాత్రి వేళల్లో పీర్లచావిడి వద్దకు చేరి సాంప్రదాయమైన కార్యక్రమాలు చేపడతారు. పీర్లను ఊరేగించే సమయంలో యువత ఆనందానికి ఆకాశమే హద్దు అన్న విధంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో నిత్యం అన్నదాన కార్యక్రమాలు చేపడతారు. అలాగే నిత్యం రాత్రి వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. అందువల్ల మొహర్రం నిర్వహించే గ్రామీణ ప్రాంతాల్లో పదిరోజుల పాటు సందడి వాతావరణం నెలకొంటుంది.

ప్రారంభమైన మొహర్రం కార్యక్రమాలు

జిల్లా వ్యాప్తంగా కొలువుదీరిన పీర్లు

గ్రామాల్లో సందడి వాతావరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement