పరుగుల సునామీ సృషించిన కడప జట్టు | - | Sakshi
Sakshi News home page

పరుగుల సునామీ సృషించిన కడప జట్టు

Jun 28 2025 8:09 AM | Updated on Jun 28 2025 8:11 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏసీఏ అండర్‌–19 మల్టీ మ్యాచ్‌లో రెండవ రోజు కడప జట్టు పరుగుల సునామీ సృష్టించింది. వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో కడప జట్టు గెలుపు దిశగా పయనిస్తోంది.

తొలి ఇన్నింగ్స్‌లో 401 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శుక్రవారం రెండవ రోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన కడప జట్టు 175.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 765 పరుగులకు డిక్లేర్‌ చేసింది. ఆ జట్టులోని ఆర్‌. ప్రణీల్‌రెడ్డి తన బ్యాటింగ్‌తో విజృంభించి 477 బంతుల్లో 39 ఫోర్లతో 353 భారీ పరుగులు చేశాడు. టి.సుదర్శన్‌ 161 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 114 పరుగులు చేశాడు, ఎన్‌. విష్ణు సాయి 68 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని మల్లిఖార్జున 2 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కర్నూలు జట్టు 7 ఓవర్లలో 1 వికెట్‌ కోల్పోయి 14 పరుగులు చేసింది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది.

కేఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో..

కేఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో 194 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో రెండవ రోజు బ్యాటింగ్‌ చేసిన అనంతపురం జట్టు 77 ఓవర్లలో 524 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఆ జట్టులోని ఎ. జయంత్‌ కృష్ణ 37 ఫోర్లు, 3 సిక్సర్లతో 221 అత్యధిక పరుగులు చేశాడు. కెహెచ్‌ వీరారెడ్డి 175 బంతుల్లో 157 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని తేజ 4 వికెట్లు, లోకేష్‌ 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన నెల్లూరు జట్టు 40 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఆ జట్టులోని కారుణ్య ప్రసాద్‌ 72 పరుగులు చేశాడు.

353 పరుగులు చేసిన కడప బ్యాట్స్‌మెన్‌ ప్రణీల్‌రెడ్డి

765 భారీ స్కోరు చేసిన కడప జట్టు

పరుగుల సునామీ సృషించిన కడప జట్టు1
1/3

పరుగుల సునామీ సృషించిన కడప జట్టు

పరుగుల సునామీ సృషించిన కడప జట్టు2
2/3

పరుగుల సునామీ సృషించిన కడప జట్టు

పరుగుల సునామీ సృషించిన కడప జట్టు3
3/3

పరుగుల సునామీ సృషించిన కడప జట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement