అతిగా మద్యం తాగి.. | - | Sakshi
Sakshi News home page

అతిగా మద్యం తాగి..

Jun 26 2025 6:37 AM | Updated on Jun 26 2025 6:37 AM

అతిగా

అతిగా మద్యం తాగి..

మదనపల్లె రూరల్‌ : అతిగా మద్యం తాగి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని చిత్తూరు బస్టాండు టౌన్‌ హాలుకు సమీపంలో షాపు రూముల ముందు ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన వ్యక్తి మంగళవారం ఉదయం నుంచి అక్కడే ఉంటూ మద్యం సేవిస్తున్నాడని బుధవారం మధ్యాహ్నం వరకు మెలకువగానే ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అతిగా మద్యం తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతిని పరిస్థితి విషమించి మృతి చెంది ఉంటాడని తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న వన్‌టౌన్‌ పోలీసులు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

అభివృద్ధికి పరిశ్రమలే కీలకం

రైల్వేకోడూరు అర్బన్‌ : సమాజంలో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందడానికి పరిశ్రమలే కీలకమని జిల్లా సబ్‌ కలెక్టర్‌ వైఖోమ్‌ నదియా దేవి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని అనంతరాజుపేట పంచాయతీలో ఉన్న రామదాస్‌ మినరల్స్‌ కంపెనీ ఏర్పాటుకు గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి పరిశ్రమలు ఎంతో అవసరమన్నారు. అలాగే చుట్టు పక్కల నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. అలాగే స్థానిక ఎంపీటీసీ మల్లికార్జున మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మిల్లు యజమానులు, అధికారులు పాల్గొన్నారు.

అతిగా మద్యం తాగి..1
1/1

అతిగా మద్యం తాగి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement