కంకర వేశాక ఆపేశారు | - | Sakshi
Sakshi News home page

కంకర వేశాక ఆపేశారు

Jun 10 2025 7:04 AM | Updated on Jun 10 2025 7:04 AM

కంకర

కంకర వేశాక ఆపేశారు

మదనపల్లె : ఏ ప్రభుత్వమైనా ప్రజల కష్టాలు తీర్చేలా, సౌకర్యాలు కల్పించడం కోసం అభివృద్ధికి పెద్దపీట వే యాలి. గత వైఎస్సార్‌సీపీ జిల్లా అభివృద్ధి కోసం ఇదే పని చేసింది. ఒకటి రెండు కాదు వేల కోట్లతో పనులు మంజూరు చేసింది. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వీటిని కొసాగించి ప్రజల కష్టాలను దూరం చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. మంజూరైన పనుల్లో 25శాతం మించలేదన్న సాకుతో అందుబాటులోని నిధులను సద్వినియోగం చేసుకోకుండా ఏకం రద్దు చేసేసింది. దీంతో జిల్లా ప్రజల వందల కోట్ల అభివృద్ది దూరమయ్యారు. ఫలితం మళ్లీ ఇవే పనులను కూటమి ప్రభుత్వం చేపట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో అభివృద్ధి పనులే కాదు తాగునీటి కోసం మంజూరు చేసిన పనులను కక్షకట్టి అడ్డుకుంది కూటమి ప్రభుత్వం. దీంతో గ్రామీణులు తాగునీటి ఇబ్బందులను తీర్చలేని దుస్థితి నెలకొంది.

పీఆర్‌లో రూ.678 కోట్ల పనులు

2019–2024లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జిల్లాలో పంచాయతీరాజ్‌ శాఖకు సంబంధించి వివిధ పథకాలు, గ్రాంట్లు కింద రూ.1,163 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో మారుమూల పల్లెల్లో అభివృద్ధి పనులే కాకుండా పల్లెలకు అవసరమైన మౌలిక వసతులైన సిమెంటురోడ్లు, మురికినీటి కాలువలు, కల్వర్టులు, తారురోడ్లు. ప్రహరీగోడలు, ఇంటర్నల్‌ సీసీరోడ్లు, అప్రోచ్‌రోడ్లు, ప్రభుత్వశాఖల భవనాలు.. ఇలా వివిధ పనులకు నిధులు మంజూరు చేసి కేటాయించింది. గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పనులు చేపట్టారు. గత ప్రభుత్వాల్లో జరగనంత అభివృద్ధి మొదలైంది. ప్రభుత్వ పాలన పల్లె ముంగిటకు వచ్చేసింది. పాలనా వికేంద్రీకరణతో ప్రజలు మండల కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా చేశారు. విద్య, వైద్యం కూడా అందుబాటులోకి వచ్చింది. మంజూరైన ఈ నిధుల్లో 2024 జూన్‌ నాటికి రూ.678 కోట్ల అభివృద్ధి పనులను అధికారులు పూర్తి చేయించారు. మిగిలినవి పూర్తి చేసేలోగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

రూ.458 కోట్ల పనుల నిలిపివేత

కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాదిలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోని వివిధ పథకాల కింద మంజూరైన నిధుల్లో రూ.458 కోట్ల పనులను అడ్డుకుని నిలిపివేసింది. ఇందులో మొదలుపెట్టిన పనుల్లో రూ.316 కోట్ల పనులు ఆగిపోయాయి. రూ.142 కోట్ల పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఇందులో సచివాలయాలు, డిజిటల్‌ లైబ్రరీలు, ఆర్‌బీకేలు, రహదారులు, సిమెంటురోడ్లు ఇలా గ్రామీణ ప్రాంతాలకు కల్పించాల్సిన సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి.

రూ.382 కోట్ల తాగునీటి పనులు రద్దు

కూటమి ప్రభుత్వంలో జిల్లాలో గ్రామీణ ప్రజలకు తాగునీటిని అందించాలని మంజూరు చేసిన పథకాలపైనా అక్కసు వెళ్లగక్కింది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో తాగునీటికి సంబంధించిన పనులు చేపట్టి, ప్రజలకు నిరంతరం తాగునీటిని అందించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.382.48 కోట్ల విలువైన 4,709 పనులు చేపట్టింది. ఈ పనులు చేపడుతుండగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం 25శాతానికి మించి పనులు జరగలేదన్న నెపంతో వీటిని రద్దు చేసింది. ఈ పనుల స్థానంలో మళ్లీ కొత్త పనులు తీసురాకపోవడంతో గ్రామీణ ప్రజలకు తాగునీటి సౌకర్యాలను అందిచడంలో విఫలం అవుతోంది.

సిమెంటురోడ్లపైనా కక్ష

కూటమి ప్రభుత్వంపై తంబళ్లపల్లె నియోజకవర్గంపై ప్రత్యేకంగా కక్ష కట్టింది. ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో నియోజకవర్గానికి 223.11 కిలోమీటర్లతో 1,875 సిమెంటురోడ్లను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మంజూరు చేయించారు. దీనికోసం ప్రభుత్వం రూ.70.35 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.21.12 కోట్ల ఖర్చు చేసి 64.65 కిలోమీటర్ల మేర 581 పనులు పూర్తి చేయగా, మిగిలిన 158.46 కిలోమీటర్ల 1,294 పనులను రద్దు చేసింది.

మదనపల్లెలో రూ.5.33 కోట్లు పనులు

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మ దనపల్లె సెలక్షన్‌న్‌గ్రేడ్‌ మున్సిపాలిటీకి గత ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. వీటిని సద్వినియోగం చేసుకుని పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండగా రూ.5.33 కోట్ల విలువైన 101 పనులను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పట్టణ ప్రజలకు మౌలిక వసతులకు కల్పించలేని పరిస్థితి నెలకొంది.

స్థలదాతకే కష్టం

పెద్దతిప్పసముద్రం మండలం నవాబుకోటలో సచివాలయ భవనం నిర్మాణానికి స్థలం లేకపోవడంతో మాజీ సర్పంచ్‌ గిరీశం స్థలదానం చేశారు. రూ.35 లక్షల వ్యయంతో భవన నిర్మాణ పనులను ఆయనే చేపట్టారు. అయితే కూటమి ప్రభుత్వం రాకతో బిల్లులు ఆగిపోవడంతో రూ.7 లక్షలు ఆగిపోయాయి. బిల్లులు అందక దాతకే కష్టం వచ్చింది.

తంబళ్లపల్లె నియోజకవర్గంలో పంచాయతీరాజ్‌శాఖ ద్వారా రూ.388.03 కోట్లతో 665.145 కిలో మీటర్ల 355 మట్టిరోడ్లను తారురోడ్లుగా మార్చేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి కృషితో మంజూరు చేశారు. ఇందులో 257 రోడ్లను తారురోడ్లుగా పనులు పూర్తి చేశారు. మిగిలిన పనుల్లో రూ.70 కోట్ల విలువైన 77 రహదారుల పనులు చేపట్టాక కూటమి ప్రభుత్వం పెద్దిరెడ్డి కుటుంబంపై కక్షకట్టి నిలిపివేయించింది. దీంతో కంకర పరచి వదిలేసిన రోడ్లు కనిపిస్తున్నాయి. ప్రజల రాకపోకలకు ఇబ్బందులున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అలాగే టెండర్లు పూర్తయిన రహదారుల నిర్మాణాలు, బ్రిడ్జిల పనులను నిలిపివేశారు. పదులసంఖ్యలో రహదారుల పనులు ఆగిపోయాయి. కంబాలపల్లె, టీ.సదుం బ్రిడ్జిలు, బడికాయలపల్లె రహదారి పనులు ఆగిపోయాయి. వీటన్నింటికి నిధులు మంజూరై టెండర్లు కూడా పూర్తయ్యాయి.

ఏడాదిలో ఆపేసిన పీఆర్‌ పనులు

పథకం పనులు నిధులు

(కోట్లలో)

ఎన్‌ఆర్‌జీఎస్‌ 177 రూ.9.91

ఈఏపీ 23 రూ.28.23

జీజీఎంపీ 647 రూ.15.76

ఎంపీల్యాడ్స్‌ 82 రూ.3.43

సీఎస్‌ఆర్‌ 33 రూ.1.70

పీఎంజీఎస్‌వై 6 రూ.10.45

బీఎంసీయూ 169 రూ.27.99

ఎన్‌ఆర్‌జీఎస్‌ 32 రూ.2.91

డీఎంఎఎఫ్‌ 17 రూ.1.46

సీఎండీఎఫ్‌ 1 రూ.0.05

పిఆర్‌ఆర్‌ 1 రూ.1.00

డిజిటల్‌ లైబ్రరీ 206 రూ.32.96

మిగిలినవి 20 రూ.6.20

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పీఆర్‌ శాఖకు చేపట్టినవి

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఒక్క

పంచాయతీరాజ్‌శాఖ పథకాల ద్వారా

మంజూరైన పనులు రూ.1,163 కోట్లు

అందులో రూ.458 కోట్లు నిలిపివేశారు

మొదలుపెట్టి ఆగినవి రూ.316 కోట్ల

పనులు ప్రారంభం కావాల్సినవి రూ.142 కోట్ల పనులు

తాగునీటి పథకాలపైనా అక్కసు..

కంకర వేశాక ఆపేశారు 1
1/2

కంకర వేశాక ఆపేశారు

కంకర వేశాక ఆపేశారు 2
2/2

కంకర వేశాక ఆపేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement