11న రాజంపేటలో ఢిల్లీరైలుకు హాల్టింగ్‌ | - | Sakshi
Sakshi News home page

11న రాజంపేటలో ఢిల్లీరైలుకు హాల్టింగ్‌

Jun 9 2025 7:07 AM | Updated on Jun 9 2025 7:07 AM

11న రాజంపేటలో ఢిల్లీరైలుకు హాల్టింగ్‌

11న రాజంపేటలో ఢిల్లీరైలుకు హాల్టింగ్‌

రాజంపేట: రాజంపేట రైల్వేస్టేషన్‌లో ఈనెల 11న ఏపీ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు హాల్టింగ్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రైల్వే అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డిని ఆహ్వానించారు. ఆదివారం ఆకేపాటి ఎస్టేట్‌లో ఆయనను కలిసి ఆహ్వానపత్రికను అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర రవాణశాఖమంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, మేడా రఘునాథరెడ్డి, ఎమ్మెల్సీలు భూమిరామిరెడ్డి గోపాల్‌రెడ్డి, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, పీ.చంద్రశేఖర్‌రెడ్డి, కంచర్ల శ్రీకాంత్‌. జడ్పీ చైర్మన్‌ రామగోవిందరెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ జకియాఖాన్‌, మున్సిపాలిటీ చైర్మన్‌ పోలా శ్రీనివాసులరెడ్డి ఢిల్లీ రైలు స్టాపేజి కార్యక్రమానికి హాజరవుతరన్నారు. ఆకేపాటిని కలిసిన వారిలో గుంతకల్‌ రైల్వే డీఆర్‌యూసీసీ సభ్యుడు తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి, కడప కమర్షియల్‌ సూపర్‌వైజరు జనార్ధన్‌, రాజంపేట స్టేషన్‌మేనేజరు గోపాల్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement