
● పరిశ్రమల ఏర్పాటు కలేనా..
రైల్వేకోడూరు కేంద్రంలో మూతపడిన అప్సాపండ్ల రసాల పరిశ్రమను తెరిపిస్తామని..రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అప్పట్లో చెప్పినా ఆచరణలో కనిపించడం లేదు. అంతేకాకుండా బొప్పాయి, మామిడి, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారు. అందులో ఒక్కటి కూడా ఏర్పాటు కాలేదు. ఈసారి మామిడి పంట దిగుబడి తగ్గిపోయి ధరలు లేక అల్లాడిపోతున్నా కూటమి సర్కార్ ఆదుకునే దిశగా అడుగులు వేయలేదు. కనీసం పరిశ్రమల స్థాపన లేకపోగా, మంగంపేట లాంటి పెద్ద ప్రాజెక్టును సద్వినియోగం చేసుకుని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించలేని స్థితి నెలకొంది. రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల్లో మామిడితోపాటు అరటి, బొప్పాయి పంటలు విస్తారంగా పండిస్తున్న నేపధ్యంలో కూటమి పెద్దలు ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తామని మాటల గారడి చేసినా పునాది రాయి పడడం లేదు. పండ్ల తోటల రైతులు మాత్రం ఎదురుచూస్తున్నారు.