
బీటీ కళాశాలను యూనివర్సిటీగా ప్రకటించాలి
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2022లో విడుదల చేసిన జీఓ ప్రకారం బీటీ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, యూనివర్శిటీగా ప్రకటించాలని బహుజనయువసేన అధ్యక్షులు పునీత్ డిమాండ్ చేశారు. సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ను కలిసి బీటీ కాలేజీలో గతంలో తొలగించిన కోర్సులను తిరిగి ప్రారంభించి, ముఖ్యంగా ఇంటర్మీడియట్ కోర్సులను వెంటనే ప్రారంభించి అడ్మిషన్స్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ఎమ్మెల్యే షాజహాన్బాషా బీటీ కళాశాలను యూనివర్శిటీ చేస్తామని హామీ ఇచ్చారని, దానిని నిలుపుకోవాలని కోరారు.